BRICS Summit 2026: న్యూఢిల్లీలో మోదీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీ.. ప్రాంతీయ భద్రత, బహుముఖ సహకారమే అజెండా..
BRICS Summit 2026
BRICS Summit 2026: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు రాజకీయం, ఆర్థికం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై సమగ్రంగా చర్చించారు. ఇటీవల బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ (SCO) సదస్సు తర్వాత రెండు వారాల వ్యవధిలోనే వీరిద్దరూ కలవడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఈ సమావేశంలో మధ్యప్రాచ్య పోరాటాలు, నల్ల సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల సముద్ర వాణిజ్యంతో పాటు భారతీయ నావికుల భద్రతపై పడుతున్న ప్రభావం గురించి ప్రధానంగా చర్చించారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి దౌత్యమే ఏకైక మార్గమని, అంతులేని యుద్ధం నుండి యుద్ధ ముగింపు దిశగా అడుగులు పడాలని ఆకాంక్షించారు. అంతకుముందు ప్రధాని మోదీ, తమిళ మహాకవి తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్ యొక్క రష్యన్ అనువాద ప్రతిని పుతిన్కు బహుమతిగా అందించారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించారు.
పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబరులో భారత్-రష్యా సదస్సు కోసం ఢిల్లీకి రాగా, 2022లో ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత రష్యా బయట స్వయంగా ఒక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి. భారత అధ్యక్షతన సెప్టెంబర్ 12-13 తేదీలలో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాలు తమ ఉమ్మడి ప్రాధాన్యతలను సమీక్షించుకోవడంతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నాయి.
- Telangana Assembly Session: మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగారు.. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి సబితాఇంద్రారెడ్డి ఫిర్యాదు..డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన..
- China-India Relations: కరోనా తర్వాత తొలిసారిగా భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న భారత్–చైనా సంబంధాలు..
- US H-1B Rules: అమెరికాలో ఉద్యోగం పోతే వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఎత్తివేసే యోచనలో ట్రంప్ సర్కారు..
- BRICS Summit 2026: న్యూఢిల్లీలో మోదీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీ.. ప్రాంతీయ భద్రత, బహుముఖ సహకారమే అజెండా..
- Musi Riverfront Project: మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. NGTలో పర్యావరణ అంశంపై పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు..