Skip to content
తాజా
నేను పరారీలో లేను.. భారతదేశానికి తిరిగి వచ్చే ఆలోచన లేదు.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం.. పూర్తి వివరాలు ఇవే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి.. అస్సాంలో మైనర్ బాలికపై దారుణం.. కారులో బంధించి నెలల పాటు గ్యాంగ్ రేప్..ఐదుగురు నిందితుల అరెస్ట్ సముద్రం రక్తమోడింది.. ఫారో దీవుల్లో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత.. మండిపడుతున్న జంతు హక్కుల సంఘాలు.. కాంగోలో ఎబోలా కలకలం.. అంత్యక్రియల బృందంపై దాడి.. 11 మంది రోగులు చికిత్స కేంద్రం నుంచి పరార్ ఐఎండీ చల్లని కబురు.. కేరళ, తమిళనాడును తాకిన నైరుతి రుతుపవనాలు.. పంజాబ్‌లోని ఐదు ప్రధాన ఆలయాలకు బాంబు బెదిరింపులు..భారీ భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు.. అసలు నీ ఊరేది.. నువ్వెవడివి?.. ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత బండ్ల గణేష్ నిప్పులు! అమరావతి అద్భుతం అయితే హైదరాబాద్‌లో ఎందుకున్నారు..పవన్, చంద్రబాబుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. నేను పరారీలో లేను.. భారతదేశానికి తిరిగి వచ్చే ఆలోచన లేదు.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం.. పూర్తి వివరాలు ఇవే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి.. అస్సాంలో మైనర్ బాలికపై దారుణం.. కారులో బంధించి నెలల పాటు గ్యాంగ్ రేప్..ఐదుగురు నిందితుల అరెస్ట్ సముద్రం రక్తమోడింది.. ఫారో దీవుల్లో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత.. మండిపడుతున్న జంతు హక్కుల సంఘాలు.. కాంగోలో ఎబోలా కలకలం.. అంత్యక్రియల బృందంపై దాడి.. 11 మంది రోగులు చికిత్స కేంద్రం నుంచి పరార్ ఐఎండీ చల్లని కబురు.. కేరళ, తమిళనాడును తాకిన నైరుతి రుతుపవనాలు.. పంజాబ్‌లోని ఐదు ప్రధాన ఆలయాలకు బాంబు బెదిరింపులు..భారీ భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు.. అసలు నీ ఊరేది.. నువ్వెవడివి?.. ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత బండ్ల గణేష్ నిప్పులు! అమరావతి అద్భుతం అయితే హైదరాబాద్‌లో ఎందుకున్నారు..పవన్, చంద్రబాబుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
క్రైమ్ వార్తలు

ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి..

Prajapaksham 04 Jun 2026 0 నిమిషాల పఠనం క్రైమ్
ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి..

Tragedy in Prakasam: Four Children Die While Bathing in Pond

ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామం వద్ద తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొడదామని వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను కరేటి అభిరామ్ (14), అతని తమ్ముడు కరేటి సుశాంత్ (12) లతో పాటు పొదిలి చిన్ను (11), ఇల్లా దినేష్ (10) లుగా గుర్తించారు. చెరువుకొమ్ముపాలెం సమీపంలోని నీటికుంట వద్దకు ఆడుకోవడానికి వెళ్లిన ఈ నలుగురు చిన్నారులు, లోతు తెలియకుండా ఈతకు దిగి నీటిలో గల్లంతయ్యారు.

చిన్నారులు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు, స్థానికులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. నీటికుంట వద్ద దుస్తులు కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక ఈతగాళ్ల సాయంతో కుంటలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ గాలింపులో అన్నదమ్ములైన అభిరామ్, సుశాంత్‌లతో పాటు దినేష్, చిన్నుల మృతదేహాలు ఒకరి తర్వాత ఒకరు నీటిలో నుంచి లభ్యమయ్యాయి. కళ్ల ముందే ఆడుకుంటూ తిరిగిన నలుగురు చిన్నారులు ఇలా విగతజీవులుగా మారడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *