Skip to content
తెలంగాణ వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కదలని నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రమంతా విస్తరణకు మరో 3 రోజులు లేటు..

Prajapaksham 10 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కదలని నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రమంతా విస్తరణకు మరో 3 రోజులు లేటు..

Monsoon

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం అవి కేవలం జోగులాంబ గద్వాల జిల్లాలోనే కేంద్రీకృతమై ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాలకు విస్తరించడానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని వారు స్పష్టం చేశారు. అయితే, మరో మూడు లేదా నాలుగు రోజుల్లో ఇవి క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఈ రుతుపవనాల ప్రభావం వల్ల బుధవారం నాడు నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఆయా జిల్లాలకు అధికారులు ‘ఎల్లో’ (పసుపు) రంగు హెచ్చరికలను జారీ చేశారు. వీటితో పాటు రానున్న గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.