Skip to content
తాజా
పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్..200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌ నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు దోచుకుంది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ హైలైట్స్.. ఎన్ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట.. రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలి.. విశాఖ ఆక్వా కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. భారత కరెన్సీలో మార్పులపై సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన.. త్వరలో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా.. హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు సంఖ్య.. భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్..హైకోర్టులో నో రిలీఫ్ .. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై దాడులను ఖండించిన ప్రజాస్వామ్యవాదులు.. సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీవ్ర ఆగ్రహం.. ఐరాస భద్రతా మండలి నుంచి పాకిస్థాన్ ఔట్.. కిర్గిస్తాన్ తొలిసారిగా ఎంట్రీ.. కొత్తగా ఐదు దేశాల ఎన్నిక పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్..200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌ నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు దోచుకుంది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ హైలైట్స్.. ఎన్ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట.. రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలి.. విశాఖ ఆక్వా కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. భారత కరెన్సీలో మార్పులపై సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన.. త్వరలో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా.. హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు సంఖ్య.. భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్..హైకోర్టులో నో రిలీఫ్ .. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై దాడులను ఖండించిన ప్రజాస్వామ్యవాదులు.. సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీవ్ర ఆగ్రహం.. ఐరాస భద్రతా మండలి నుంచి పాకిస్థాన్ ఔట్.. కిర్గిస్తాన్ తొలిసారిగా ఎంట్రీ.. కొత్తగా ఐదు దేశాల ఎన్నిక
తెలంగాణ వార్తలు

నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి

Prajapaksham 05 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి

Tragedy in Nizamabad: Three Drown While Bathing in Manjira River

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతవగా.. వారిలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మంగల్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది గ్రామీణులు, బాన్సువాడ మండలం బుడిమి శివారులో ప్రవహిస్తున్న మంజీరా నది వద్ద ఉన్న ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం కుటుంబానికి చెందిన భానుప్రసాద్, అనిత (40), పావని (14), శివాని (13) నదిలో స్నానం చేయడానికి దిగారు.

అయితే, నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, లోతును అంచనా వేయలేకపోవడంతో నలుగురూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్నవారు గమనించి వెంటనే కేకలు వేయడంతో స్థానికులు, జాలరులు నదిలోకి దూకి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారు భానుప్రసాద్‌ను ప్రాణాలతో రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగలిగారు.

కానీ, మిగిలిన ముగ్గురు అనిత, పావని, శివానిలు అప్పటికే నీట మునిగి శ్వాస ఆడక మరణించారు. స్థానికులు శ్రమించి వారి ముగ్గురి మృతదేహాలను నది నుండి బయటకు వెలికితీశారు. దైవదర్శనానికి వచ్చి, కళ్లముందే ముగ్గురు ఆడవాళ్లు విగతజీవులుగా మారడంతో మంగల్ కిష్టాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *