Skip to content
వినోదం వార్తలు

గూఢచారికి సీక్వెల్‌గా ‘జీ2’

Prajapaksham 18 Sep 2026 0 నిమిషాల పఠనం వినోదం
గూఢచారికి సీక్వెల్‌గా ‘జీ2’

Adivi Sesh

అడవి శేష్‌ హీరోగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ స్పై థ్రిల్లర్‌ గూఢచారికి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘జీ2’ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. 2027 ఫిబ్రవరి 5న వరల్‌ వైడ్‌ థియేటర్లలో రిలీజ్‌ కానుంది. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్‌ పార్ట్‌ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు ఇండియన్‌ సినిమాలో స్పై థ్రిల్లర్‌ జానర్‌ని రీడిఫైన్‌ చేయనుంది.ఈసారి ఏజెంట్‌ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ వున్న క్యారెక్టర్‌ ఇది. ఈ మూవీలో ఇమ్రాన్‌ హష్మీ పవర్‌ ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియాగా రిలీజ్‌ కానుంది.