జీవనశైలిని సరళతరం చేస్తున్న వై-ఫై టెక్నాలజీ
జీవనశైలిని సరళతరం చేస్తున్న వై-ఫై టెక్నాలజీ
(జూన్ 20న ప్రపంచ వై-ఫై దినోత్సవం సందర్భంగా)
ప్రతి సంవత్సరం జూన్ 20న జరుపుకునే ప్రపంచ వై-ఫై దినోత్సవం (వరల్డ్ వై-ఫై డే), ‘కనెక్టెడ్ కమ్యూనిటీస్ ఫోరమ్’ నాయకత్వంలో ‘వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ అలయన్స్’ నిర్వహించే ఒక ప్రత్యేకమైన ప్రపంచవ్యాప్త కార్యక్రమం.
‘వై-ఫై’ అనేది ‘వైర్లెస్ ఫిడిలిటీ‘కి సంక్షిప్త రూపంగా విస్తృతంగా బోధించబడు తూ ఆమోదించబడింది. ఈ రోజున మన దైనందిన జీవితాలకు వై-ఫై అందించే గొప్ప సహకారాన్ని, ఆవిష్కరణను, ఇంటర్నెట్ సదుపాయం లేని వారిని అనుసంధానించాలనే లక్ష్యాన్ని మనం తీసుకుంటున్నాం. నేటికీ ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్లకు పైగా ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇంటర్నెట్ సదుపా యం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు వృద్ధిని అందిస్తుంది, వారి సామాజిక చలనశీలతను, కంప్యూటర్ అక్షరాస్యతను మెరుగుపరుస్తుంది, అలాగే వారి విద్యావకాశాలను సుసంపన్నం చేస్తుంది. ఈ దినోత్సవం 1997లో ప్రారంభమై ప్రతి ఏటా మరింత ఉత్సాహంతో కొనసాగుతున్నది.
అనుసంధానం లేని వారిని అనుసంధానిద్దాం:
ప్రపంచ వై-ఫై దినోత్సవం, డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో వైర్లెస్ టెక్నాలజీ పోషించిన పరివర్తనాత్మక పాత్రను వేడుకగా జరుపుకుంటుంది. అలాగే, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ‘అనుసంధానం లేని వారిని అనుసంధానించే’ నిరంతర కార్యాన్ని ఇది ప్రముఖంగా చాటి చెబుతుంది. ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటు ధరలో, సుస్థిరంగా అందించే ప్రయత్నాలను ఇది హైలైట్ చేస్తుంది. తద్వారా, అణగారిన వర్గాలకు విద్య, పరిశోధన, టెలి-హెల్త్, ఆర్థిక అవకాశాలను కల్పిస్తుంది. 1977 నాటి తొలి 2 Mbps నెట్వర్క్ల నుండి నేటి ఆధునిక గిగా
బిట్-స్పీడ్ వై-ఫై 6, వై-ఫై 7 టెక్నాలజీల వరకు వేగవంతమైన పురోగతిని ఈ రోజు గుర్తిస్తుంది. ఇటీవల ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ యొక్క ‘పరివర్తన కోసం ఆవిష్కరణలు’ (Innovate to Transform) అనే థీమ్కు అనుగుణంగా, ఈ సంవత్సరం ప్రపంచ వై-ఫై దినోత్సవ వేడుకలను ‘భారతదేశాన్ని పరివర్తన చెందిస్తూ, ప్రపంచం కోసం ఆవిష్కరిస్తూ’ (Transforming India, Innovating for the World) అనే థీమ్తో జరుపుకుంటున్నారు.
ప్రధానమంత్రి వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, PM-WANI:
ప్రపంచ కనెక్టివిటీపై వై-ఫై యొక్క ప్రగాఢ ప్రభావాన్ని, అలాగే ఆర్థిక వృద్ధి, సామాజిక చైతన్యం, విద్య, డిజిటల్ సమ్మిళితాన్ని నడిపించడంలో దాని కీలక పాత్రను ఈ రోజు నొక్కి చెబుతోంది. భారతదేశంలో, PM-WANI (ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్) వంటి కార్యక్రమాలు, అందరికీ డిజిటల్ సమ్మిళితం అనే లక్ష్యానికి మద్దతునిస్తూ, పబ్లిక్ హాట్స్పాట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశంలో 90 శాతానికి పైగా బ్రాడ్బ్యాండ్ వినియోగం వై-ఫై నెట్వర్క్ల ద్వారానే జరుగుతున్నందున, ఇటీవల 6 GHz బ్యాండ్ను డీలైసెన్సింగ్ చేయడం అనేది తదుపరితరం వై-ఫై (6E మరియు ఆపైన) యొక్క కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు.
ఇది వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన హోమ్ వై-ఫైకి, భవనాలలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ కవరేజీకి, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ఫ్యాక్టరీల వంటి పరిశ్రమలలో ప్రైవేట్ నెట్వర్క్ల రంగంలో ఆవిష్కరణలకు అవకాశాలకు దారితీస్తుంది. 2030 నాటికి 5 కోట్ల పబ్లిక్ వై-ఫై హాట్స్పాట్లను సాధించాలనేది లక్ష్యం. 2015లో కోల్కతా భారతదేశపు మొట్టమొదటి వై-ఫై సౌకర్యం గల మెట్రో నగరంగా గుర్తింపు పొందింది. అయితే, వాణిజ్యపరమైన పూర్తి వైర్లెస్ పబ్లిక్ యాక్సెస్ విషయంలో, వారసత్వ నగరమైన మైసూరు 2005లోనే ఈ ఘనతను సాధించింది. జనవరి 2017లో, ప్రభుత్వ నిధులతో 500 పబ్లిక్ వై-ఫై హాట్స్పాట్లతో కూడిన భారీ నెట్వర్క్ను ప్రారంభించిన మొట్టమొదటి భారతీయ నగరంగా ముంబయి నిలిచింది.
ఇంటర్నెట్ ఎప్పటినుంచో మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. ఆఫీసులో ఆన్లైన్ పరిశోధన, వీడియో సమావేశాల నుండి వ్యక్తిగత సంభాషణలు, వినోదం వరకు -మన జీవితంలోని ఎన్నో రంగాలు ఆన్లైన్లో భాగమవుతున్నాయి. వై-ఫై (Wi-Fi) పుణ్యమా అని, చాలా ఆధునిక క్లయింట్ పరికరాలతో ఇదంతా వైర్లెస్గా సాధ్యమవుతోంది. ప్రపంచ వై-ఫై దినోత్సవాన్ని పురస్కరించుకుని, మనం ఈ సాంకేతికత, దాని చరిత్ర, భవిష్యత్తును నిశితంగా
పరిశీలిద్దాం, ప్రశంసిద్దాం.