21న ‘ఏందయ్యా సామీ..’
Ranabaali Music Mania Begin with Endhayya Saami on Sept 21
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘రణబాలి’ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి‘ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ‘రణబాలి‘ సినిమా వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ’ఏందయ్యా సామీ..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విజయ్, రశ్మిక పెళ్లి సందర్భంగా రిలీజ్ చేసిన ’ఏందయ్యా సామీ..’ సాంగ్ ప్రోమో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ ఫుల్ వెర్షన్ సాంగ్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి ఫ్యాన్స్ లోనూ, ఇటు మూవీ లవర్స్ లోనూ ‘రణబాలి‘ సినిమా ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది. చిత్రానికి కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన మ్యూజిక్ – అజయ్ – అతుల్, డిఒపి – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ, రైటర్ – ప్రమోద్ తమ్మినేని, ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని, ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య, కొరియోగ్రఫీ – కృతి మహేశ్.
- Gurugram Spa Raid: స్పా సెంటర్ల మాటున వ్యభిచారం.. మాల్ లోపల సీన్లు చూసి ఖంగుతిన్న పోలీసులు.. గురుగ్రామ్లో 18 స్పాలపై రైడ్..
- Sea vs Ocean: సముద్రం vs మహాసముద్రం.. ఇవి రెండు ఒకటి కాదు.. రెండు పదాల మధ్య తేడా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..
- Petrol Pump UPI Rules: పెట్రోల్ పంప్ డీలర్లు సంచలన నిర్ణయం.. రూ.2,000 దాటితే UPI పేమెంట్స్ బంద్.. అక్టోబర్ 15 నుంచి అమలు?
- Russia Sanctions Bill: ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం, భారత్-చైనాకు 100% టారిఫ్ ముప్పు
- Hyderabad Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. వినాయక నిమజ్జనం నుంచి తిరిగి వస్తుండగా విషాద ఘటన..