Godavari Flood Surge at Polavaram: పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గేట్లు ఎత్తి వరద నీటి విడుదల
Godavari floods
Godavari Flood Surge at Polavaram: తెలంగాణతో పాటు గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది.
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నీటిమట్టం 30.30 మీటర్లకు, స్పిల్వే వద్ద 30.20 మీటర్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. వరద నీటిని నియంత్రించేందుకు స్పిల్వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి, దిగువకు సుమారు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతితో దేవీపట్నం మండలంలోని ప్రముఖ గండిపోశమ్మ ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు, సమీపంలోని దుకాణాలు నీట మునిగాయి.
పి.గొందూరు నుంచి నాగులపల్లి మధ్య రహదారిపైకి కూడా వరద నీరు చేరడంతో ఆలయానికి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
- వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
- Telangana Political Row: కేటీఆర్,హరీష్ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..
- Telangana Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!
- Saudi Arabia’s Water Miracle: నదులు లేకపోయినా కోట్ల మందికి మంచి నీరు ఎలా.. సౌదీ అరేబియా వాటర్ సప్లై వెనుక అసలు రహస్యం..
- Eiffel Tower: ఈఫిల్ టవర్ వద్ద లింగ వివక్ష వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించడంపై సిబ్బంది ఆగ్రహం..