SBI ATM Rules 2026: ఎస్బీఐ శాలరీ ఖాతాదారులకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
SBI
SBI ATM Rules 2026: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు కీలక మార్పును ప్రకటించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా చేసుకునే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం 2026 అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. దీంతో తరచూ ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించే ఎస్బీఐ శాలరీ ఖాతాదారులపై ప్రభావం పడనుంది.
ప్రస్తుతం ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులు ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలు లేదా ఆటోమేటెడ్ డెబిట్ కమ్ విత్డ్రాయల్ మెషీన్లలో నెలకు 10 ఉచిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజా సవరణలతో ఈ పరిమితిని 10 నుంచి 5కు తగ్గించారు. అంటే అక్టోబర్ 1 తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ పరిమితిని దాటిన తర్వాత ఖాతాదారులు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ప్రతి అదనపు ట్రాన్సాక్షన్పై రూ.23తో పాటు జీఎస్టీ వసూలు చేయనున్నారు. అదే సమయంలో బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ.11తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఈ కొత్త నిబంధనపై ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది అందరికీ వర్తించదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈ మార్పు కేవలం శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు మాత్రమే** వర్తిస్తుంది. అదీ ఎస్బీఐకి చెందని ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించిన సందర్భంలో మాత్రమే అమలవుతుంది.
ఎస్బీఐ సొంత ఏటీఎంలలో లావాదేవీలు చేసే శాలరీ ఖాతాదారులకు ఈ కొత్త పరిమితి వర్తించదని బ్యాంకు తెలిపింది. అంటే సొంత ఎస్బీఐ ఏటీఎంల వినియోగంపై ఈ మార్పు ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అలాగే సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు కూడా ఈ కొత్త నిబంధనలతో సంబంధం లేదని, వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే కొనసాగుతాయని పేర్కొంది.
ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా వినియోగించే ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులు ఇకపై తమ నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని గమనించాల్సి ఉంటుంది. అనవసరమైన అదనపు చార్జీలను తప్పించుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఎస్బీఐ ఏటీఎంలను వినియోగించడం లేదా ఇతర బ్యాంకు ఏటీఎం లావాదేవీల సంఖ్యను నెలకు ఐదులోపే పరిమితం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- SBI ATM Rules 2026: ఎస్బీఐ శాలరీ ఖాతాదారులకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- Telangana Politics: కేబినెట్ నుంచి కొండా సురేఖ ఔట్.. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే..
- Viral Video: పిడుగు పడినా ప్రాణాలతో బయటపడ్డాడు.. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
- Donald Trump on Iran: వారు బాత్రూమ్కు వెళ్లినా మాకు క్షణాల్లో తెలిసిపోతుంది.. ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Vivo T5 5G Smart Phone Launch: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే వివో 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే మీ కోసం…ఓ లుక్ వేయండి..