Skip to content
జాతీయం వార్తలు

CJI Suryakanth: డిజిటల్ అరెస్ట్ స్కామ్ లపై చురుకుగా భారత న్యాయ వ్యవస్థ…లండన్ లో సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు

Krishna Rao 31 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJI Suryakanth: డిజిటల్ అరెస్ట్ స్కామ్ లపై చురుకుగా భారత న్యాయ వ్యవస్థ…లండన్ లో సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు

CJI Suryakanth: డిజిటల్ అరెస్ట్ స్కామ్ లపై చురుకుగా భారత న్యాయ వ్యవస్థ…లండన్ లో సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు

CJI Suryakanth: లండన్లో శనివారం జరిగిన 43వ అంతర్జాతీయ ఆర్థిక నేరాల సదస్సులో తన ముగింపు ప్రసంగంలో, వీడియో కాల్స్ ద్వారా పోలీస్ అధికారులు, న్యాయాధికారులు, లేదా బ్యూరోక్రాట్గా నటిస్తూ మోసగాళ్లు పౌరులను మోసం చేసే డిజిటల్ అరెస్ట్ కుంభకోణాన్ని సుప్రీం కోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించిందని సూర్యకాంత్ చెప్పారు.

CJI Suryakanth: డిజిటల్ అరెస్ట్ కుంభకోణాల వంటి కొత్తగా వెలుగులోకి వస్తున్న మోసపూరిత పథకాలపై పార్లమెంట్ పరిష్కరించే వరకూ వేచి ఉండకుండా, భారత న్యాయ వ్యవస్థ చురుకుగా స్పందించిందని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సూర్యకాంత్ పేర్కొన్నారు. లండన్లో శనివారం జరిగిన 43వ అంతర్జాతీయ ఆర్థిక నేరాల సదస్సులో తన ముగింపు ప్రసంగంలో, వీడియో కాల్స్ ద్వారా పోలీస్ అధికారులు, న్యాయాధికారులు, లేదా బ్యూరోక్రాట్గా నటిస్తూ మోసగాళ్లు పౌరులను మోసం చేసే డిజిటల్ అరెస్ట్ కుంభకోణాన్ని సుప్రీం కోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించిందని సూర్యకాంత్ చెప్పారు.

‘దీనికి ప్రతిస్పందనగా, ఈ సమస్య తీవ్రతను అంచనా వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. అలాగే జరిగిన నష్టానికి అనుపాతంగా ఉండే శిక్షలతో ఒక ప్రత్యేక నేరాన్ని నమోదు చేయాలని పిలుపునిచ్చింది’ అని సిజెఐ తెలిపారు. ‘పార్లమెంట్ ఇలాంటి డిజిటల్ అరెస్ట్ నేరాలను పరిష్కరించే వరకు వేచి చూడకుండా, కొత్తగా వెలుగులోకి వస్తున్న మోసపూరిత పథకాలకు భారత న్యాయ వ్యవస్థ చురుకుగా స్పందిస్తోంది అనడానికి ఇది ఒక విస్తృత నమూనాలకు నిదర్శనం’ అని సిజెఐ అన్నారు.

ఆర్థిక నేరాల పట్ల భారతదేశం ఆధునిక ప్రతిస్పందనను పరిశీలించినప్పుడు, దానిని ఒకే చట్టంగా కాకుండా, వరుస దశాబ్దాలుగా ఉద్దేశపూర్వకంగా నిర్మించిన ఒక బహుళ అంచెల నిర్మాణంగా ఉత్తమంగా అర్థం చేసుకోవాలని, ఇందులో శాసనాలు, సంస్థలు, న్యాయ సిద్ధాంతాలు ఒక్కొక్కటి విభిన్నమైన పనిని చేసేలా రూపొందించబడ్డాయని ఆయన వివరించారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ), 2002, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల చట్టం, 2018ల గురించి సిజెఐ సూర్యకాంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

‘ఇవి లోపరహితమైన యంత్రాంగాలు కావు అని నేను తప్పక పేర్కొనాలి. దర్యాప్తు సంస్థలు పిఎంఎల్ఎ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నాయని అనేక మంది ఆరోపించారు. ఇందులో స్పష్టమైన కారణాలు చేయకుండానే అరెస్ట్లు చేయడం, వాస్తవ పరిస్థితులు సమర్థించే దానికంటే ఎక్కువ కాలం కస్టడీని పొడిగించడం వంటివి ఉన్నాయి. ఇలాంటి ప్రతీ సందర్భంలోనూ పరిస్థితిని సరిదిద్దడానికి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంది’ అని ఆయన అన్నారు.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. అరెస్ట్కు గల కారణాలను నిందితుడికి కేవలం బిగ్గరగా చదివి వినిపించకుండా, రాతపూర్వకంగా అందించాలి. ‘అంతేకాకుండా, నేను తీర్పు రాసే అవకాశం లభించిన అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసులో సుదీర్ఘ విచారణ పూర్వ నిర్బంధాన్ని వేరొక రూపంలో శిక్షగా మార్చకూడదనే సూత్రం ఆధారంగా, కోర్టు అరెస్ట్ చట్టబద్ధతను సమర్థించినప్పటికీ బెయిల్ మంజూరు చేసింది’ అని సిజెఐ సూర్యకాంత్ వివరించారు.

చట్టపరమైన, సాంకేతికపరమైన పరిణామాలు ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న విషయమేమిటంటే, చట్టబద్ధమైన ప్రక్రియ, అనుపాతత, నిర్దోషిత్వ భావన అనేవి తమ న్యాయశాస్త్రానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండాలని సుప్రీంకోర్టు పట్టుబట్టడమేనని సిజెఐ అన్నారు. క్రీ.పూ. రెండవ శతాబ్దంలో భారతీయ రాజనీతిజ్ఞుడు, గురువు అయిన కౌటిల్యుడు రాజ్యాధికారి దాని ఖజానాను ఏయే విభిన్న మార్గాలలో దోచుకోగలడో తన ‘అర్థశాస్త్రం’ అనే రాజనీతి గ్రంథంలో రాసారని సిజెఐ వివరించారు.

‘అప్రమత్తత, సహకారం, చట్టబద్ధమైన పాలన మోసాన్ని సమాన స్థాయిలో ఇంకా చెప్పాలంటే పెరుగుతున్న స్థాయిలో అడ్డుకుంటాయనదే ఈ సదస్సు సమాధానం కావాలి’ అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు: Indian Politics political news