Badlaav Zaroori Hai LIVE Telecast: ఎరుపెక్కిన ఢిల్లీ…బద్లావ్ జరూరీ హై బహిరంగ సభకు కదం తొక్కిన కామ్రేడ్లు…లైవ్ ఇక్కడ వీక్షించండి..
CPI Mega Rally
కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) పోరాటాన్ని ముమ్మరం చేసింది. మంగళవారం న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్లీలా మైదాన్లో ‘బద్లావ్ జరూరీ హై’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగానికి ముప్పు పెరుగుతోందని, కేంద్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశం నిరంతరం సంక్షోభంలో కూరుకుపోతోంది. రోజురోజుకూ ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు మార్పును ఆకాంక్షిస్తున్నారు. ‘బద్లావ్ జరూరీ హై’ అనేది కేవలం సిపిఐ నినాదం మాత్రమే కాదు, అది దేశ ప్రజల నినాదం. ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే మా ఉద్దేశం, ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుంది” అని అమర్ జీత్ కౌర్ స్పష్టం చేశారు.
సుదీర్ఘ కాలం తర్వాత సిపిఐ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహిస్తోందని రాజ్యసభ ఎంపీ పి. సంతోష్ కుమార్ తెలిపారు. “ఇది ఎంతో ఘనంగా జరిగిన ర్యాలీ. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రామ్లీలా మైదాన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత సిపిఐ ఇక్కడ ఇంత భారీ ప్రదర్శనను నిర్వహిస్తోంది. దేశంలో బిజెపి పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, మార్పు అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తున్న నినాదంగా మారింది” అని అమర్ జీత్ కౌర్ పేర్కొన్నారు.
మరో సిపిఐ నాయకురాలు ఆనీ రాజా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో నమోదు చేసిన 7.8 శాతం జిడిపి (GDP) వృద్ధి గణాంకాలను ప్రస్తావిస్తూ, దేశంలో పెరిగిపోతున్న ఆదాయ, సంపద అసమానతలను ఆమె ఎత్తిచూపారు. “ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థలు, వ్యాపారవేత్తలకు అనుకూలంగా పనిచేస్తోంది తప్ప సామాన్య ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజలకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వం రావడమే సిపిఐ ధ్యేయం. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ రక్షణ ముఖ్యం. మహారాష్ట్రలోని మిడ్-డే మీల్స్ కార్మికులకు నెలకు 3,000 రూపాయల కంటే తక్కువ ఇస్తున్నారు. దేశ జిడిపి పెరుగుదలకు, సాధారణ ప్రజల కష్టాలకు ఏమైనా సంబంధం ఉందా? ప్రధాని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని ఆనీ రాజా మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ బహిరంగ సభకు హాజరుకాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ పార్టీ నాయకులను, స్థానిక కార్యకర్తలను అక్రమంగా గృహ నిర్బంధం చేస్తోందని ఆరోపిస్తూ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.