CM Revanth Reddy: ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి గుడ్న్యూస్.. సమస్యల పరిష్కారానికి హామీ..
CM Revanth Reddy’s Key Message at Tungabhadra Brings New Hope for Farmers of Three States
CM Revanth Reddy: రాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తనకు రెండేళ్ల సమయం ఇస్తే పెండింగ్ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించి చూపిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
తల్లిదండ్రులతో సమానంగా సమాజంలో పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేది ఉపాధ్యాయులేనని సీఎం కొనియాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను ఇటీవల విజయవంతంగా పూర్తి చేశామని, టీచర్ల బదిలీల విషయంలోనూ ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా, పారదర్శకంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పాలిటెక్నిక్ విద్యావిధానంలో విద్యార్థులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి ప్రతికూల మార్పులు చేయడం లేదని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యాశాఖ కమిషన్ ద్వారా ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీకి సంబంధించిన సమస్యలను కొలిక్కి తెచ్చామని గుర్తుచేశారు. అయితే, ఇటీవల కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయడం తనను ఎంతగానో బాధించిందని, ఉపాధ్యాయులు రోడ్డెక్కకుండా నేరుగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సభ ప్రారంభానికి ముందు కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన ఉపాధ్యాయులను సత్కరించి, వారితో కలిసి సామూహిక ఛాయాచిత్రం (గ్రూప్ ఫొటో) దిగారు.
- AP 12th PRC latest news: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..12వ పీఆర్సీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
- 28 New Zilla Parishads Established in AP: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ. 13 జెడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్లు ఏర్పాటు…
- New Chinese H-20 Xian bomber: చైనాకు చెందిన కొత్త H-20 బాంబర్ విమానంతో అమెరికాకు షాక్…US బి20 బాంబర్ కు పోటీ..?
- CM Revanth Reddy: ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి గుడ్న్యూస్.. సమస్యల పరిష్కారానికి హామీ..
- Telangana Politics: అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.. పొన్నం ప్రభాకర్ డిమాండ్.. BRS అధినేత వైఖరికి నిరసనగా 6న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా..