కర్ణాటక నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. షర్మిలకు మొండిచేయి..
YS Sharmila Misses Out as Congress Finalises Karnataka Rajya Sabha Nominees
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కర్ణాటక కోటా నుండి రాజ్యసభకు వెళ్తారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు తెరపడింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమెకు నిరాశే మిగిలింది.
కర్ణాటక నుండి మొత్తం ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభకు పంపేందుకు సరిపడా సంఖ్యా బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరై ఖర్గేకు మద్దతు తెలపనున్నారు.
మల్లికార్జున ఖర్గేతో పాటు మిగిలిన రెండు స్థానాలకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం గురువారమే అభ్యర్థులను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, అలాగే కేంద్ర మాజీ మంత్రి రెహ్మాన్ఖాన్ కుమారుడైన మన్సూర్ ఆలీఖాన్లకు ఈసారి కర్ణాటక నుండి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో షర్మిల రాజ్యసభ ఎంట్రీపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.