Bankipur Bypoll Result: బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు.. విజయానికి దగ్గరలో ప్రశాంత్ కిషోర్.. దతియాలో కాంగ్రెస్ దూకుడు.. మంజల్పూర్ స్థానం బీజేపీ కైవసం..
Prashant Kishor
బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ భారీ ఆధిక్యంతో విజయానికి చేరువవుతున్నారు. తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై దాదాపు 15,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Bankipur Bypoll Result: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంటోంది. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన కీలక స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
బీహార్లోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా (1995 నుండి) భారతీయ జనతా పార్టీకి అభేద్యమైన కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో.. తొలిసారిగా నేరుగా ఎన్నికల బరిలోకి దిగిన జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆధిక్యంతో విజయం దిశగా సాగుతున్నారు.
25వ విడత లెక్కింపు తర్వాత స్థితి:
ప్రశాంత్ కిషోర్ (జన్ సూరజ్ పార్టీ): 50,976 ఓట్లు (ఆధిక్యం: 14,953 ఓట్లు)
నీరజ్ కుమార్ సిన్హా (బీజేపీ): 36,023 ఓట్లు
రేఖా కుమారి (ఆర్జేడీ): 11,515 ఓట్లు
మొత్తం 31 విడతల్లో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. 15 వేలకు పైగా ఓట్ల సునాయాస ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ కొనసాగుతుండటంతో పాట్నాలోని జన్ సూరజ్ ప్రధాన కార్యాలయం వద్ద మద్దతుదారులు అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంటున్నారు.
మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 14వ విడత లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కున్వర్ ఘనశ్యామ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన అశుతోష్ తివారీపై 7,544 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.
గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్భాయ్ పటేల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి భిఖాభాయ్ రబారీపై ఏకంగా 30 వేల కంటే ఎక్కువ ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు.
గుజరాత్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకోగా.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతిఘటన చూపిస్తోంది. అయితే, బీహార్లో సుదీర్ఘకాలంగా ఉన్న బీజేపీ కంచుకోటను బద్దలు కొడుతూ ప్రశాంత్ కిషోర్ సాధిస్తున్న ఆధిక్యం రాబోయే ఎన్నికల సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- Bankipur Bypoll Result: బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషొర్ ఘన విజయం.. 30 ఏళ్ల బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టిన జన్ సూరజ్ పార్టీ అధినేత..
- Hyderabad Rain Alert: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త..రాత్రికి వాన కుమ్ముడే కుమ్ముడు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక..
- టీటీడీలో అవినీతికి అంతం లేదా నారా లోకేష్.. ఆసుపత్రుల్లో మందులను కూడా వదలరా..
- వైసీపీలో భయాన్ని పోగొడుతున్న టీడీపీ.. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని తన గొయ్యి తానే తవ్వుకుంటోందా..
- సముద్రంలో కలిసిపోతున్న కోస్తా నగరాలు.. సముద్ర మట్టం కంటే వేగంగా కుంగిపోతున్నట్లు శాస్త్రవేత్తల హెచ్చరిక..