గొడ్డలి పట్టిన అయ్యప్ప భక్తుడు
Irumudi
రవితేజ తాజా చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్’, పాటలతో ఆసక్తిని రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 12న భీమవరంలో జరిగే భారీ కార్యక్రమంలో ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి రవితేజ హాజరుకానుండటంతో ఇది సినిమా ప్రచారంలో ఒక కీలక ఘట్టం కానుంది. ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తున్నారు. ఒకవైపు నోటిలో గొడ్డలితో మాస్ లుక్లో కనిపిస్తుండగా, మరోవైపు అయ్యప్ప మాల ధరించిన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపిస్తున్నారు. ‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు చూడని విధంగా మరింత ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లో ఆకట్టుకుంది. దీంతో సినిమాలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు కీలక స్థానం ఉండబోతుంది.
ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్గా పనిచేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘ఇరుముడి’కి భీమవరంలో జరుగనుంది. మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీఓపీ : విష్ణు శర్మ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి.
- చరిత్ర పునరావృతం కాకూడదు..బిల్లులు ప్రవేశ పెట్టేందుకు బీజేపీ వ్యూహం ఇదే అంటున్న జైరాం రమేష్
- మమతా బెనర్జీ కారుపై దాడి…దొంగ, దొంగల రాణి అంటూ నినాదాలు
- SIR: రాష్ట్రంలో 78.14 శాతం ఎస్ఐఆర్ డిజిటైజేషన్ పూర్తి
- ప్రయాణాల రద్దు వద్దు- సర్దుబాట్లే ముద్దు…బుకింగ్ డాట్ కామ్ సర్వే నివేదిక వెల్లడి
- అమెరికాతో చర్చలు జరగడం లేదు: తేల్చి చెప్పిన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాఘ్చీ