డయల్ 100కు గుడ్బై.. తెలంగాణలో అత్యవసర సేవలకు ఇక నుంచి 112 మాత్రమే
CV Anand
తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రమాదాలు, ఆపద సమయాల్లో సత్వర సాయం అందించేందుకు డయల్ 100 స్థానంలో ఇకపై అమల్లోకి వస్తున్న 112 అత్యవసర సేవా నంబర్ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు.
ఇప్పటివరకు పోలీసు సహాయం కోసం డయల్ 100, అంబులెన్స్ కోసం 108, అగ్నిమాపక సేవల కోసం 101 ఇలా వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. కానీ తాజాగా అందుబాటులోకి వచ్చిన దేశవ్యాప్త ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్’ (ERSS – 112) ద్వారా అన్ని అత్యవసర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు.
పోలీస్ సహాయం
అంబులెన్స్ సేవలు
అగ్నిమాపక సేవలు (ఫైర్)
ఆపదలో ఉన్న ప్రజలు 112కు కాల్ చేయగానే కాంటాక్ట్ సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ప్రమాద స్వరూపాన్ని బట్టి సంబంధిత విభాగాలకు (పోలీస్, మెడికల్, ఫైర్) సమాచారాన్ని అందించి, ఘటనా స్థలానికి తక్షణమే వాహనాలు చేరుకునేలా సమన్వయం చేసేలా ఈ నూతన సాంకేతిక వ్యవస్థను డిజైన్ చేశారు. బాధితులకు వేగవంతమైన సాయం అందించడమే లక్ష్యంగా ఈ సేవలు రూపుదిద్దుకున్నాయి.
- పైసల్లేవ్.. ఉద్యోగుల నెత్తిమీద శ్వేతపత్రం బాంబు వేసిన చంద్రబాబు.. వాట్ నెక్స్ట్..
- డయల్ 100కు గుడ్బై.. తెలంగాణలో అత్యవసర సేవలకు ఇక నుంచి 112 మాత్రమే
- 20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్ జెబెల్ అలీలో వరుస పేలుళ్లు.. యెమెన్ క్షిపణి దాడి అనుమానాలు!
- Hyderabad Horror: ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ సిబ్బందిపై కర్రలతో దాడి.. వీడియో ఇదిగో..
- Repo Rate Unchanged: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్బీఐ..