కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. భారీ వరద ప్రవాహంతో హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Kaleshwaram
కాలేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు ఆదేశించారు.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది అత్యంత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సీడబ్ల్యూసీ కాళేశ్వరం స్టేషన్ వద్ద ఉదయం 9:00 గంటలకు నీటిమట్టం 11.50 మీటర్లకు చేరుకుంది. ఇక్కడ హెచ్చరిక స్థాయి 12.210 మీటర్లు, ప్రమాద స్థాయి 13.460 మీటర్లుగా ఉండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 96.40 మీటర్లు నమోదవ్వగా, ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో సమానంగా 8,35,800 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రవాహాన్ని సులువుగా దిగువకు పంపేందుకు బ్యారేజ్ 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఫ్రీ ఫ్లో పరిస్థితిని నిర్వహిస్తున్నారు.
తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడనం మరియు డిప్రెషన్ ప్రభావంతో రానున్న 12 నుంచి 18 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో నిరంతరాయంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే వీలుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ పని వేళలు ఇవ్వాలని, ఆఫీసుల్లో ఉన్నవారికి ముందస్తు లాగౌట్ సదుపాయం కల్పించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, మ్యాన్హోల్స్ మరియు తెగిపడిన విద్యుత్ వైర్ల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
- Harish Rao Farm House: అజీజ్నగర్ భూములపై కాంగ్రెస్ ఫీల్డ్ విజిట్.. కేటీఆర్, హరీశ్రావుపై చామల ప్రశ్నల వర్షం
- Harish Rao Farmhouse: అసైన్డ్ భూముల్లో ఫాం హౌస్ నిర్మించారు..అద్దంకి ఫైర్..హరీష్ రావు ఫాం హౌస్ భూముల్లో కాంగ్రెస్ నేతల ఫీల్డ్ విజిట్..
- Telangana Land Resurvey: భూముల రీ-సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. భూముల సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
- TIMS Hospital Theft: సనత్ నగర్ TIMS ఆసుపత్రిలో భారీ చోరీ.. 288 వైద్య పరికరాలు మాయం, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు
- Singareni Workers Land Issue: సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం, 45 రోజుల్లో పరిష్కారం