80వ స్వాతంత్ర దినోత్సవం: ఎర్రకోట నుండి వికసిత భారత్ కోసం సప్తధార రోడ్మ్యాప్ – ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు ఇవే..
80వ స్వాతంత్ర దినోత్సవం: ఎర్రకోట నుండి వికసిత భారత్ కోసం సప్తధార రోడ్మ్యాప్ - ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు ఇవే..
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. దేశ పురోగతిని సప్తధార (ఏడు రకాల శక్తి వనరులు)తో అనుసంధానిస్తూ, ఈ విధానం ద్వారా గత ఐదు నుండి ఏడు దశాబ్దాలుగా సాధించలేని లక్ష్యాలను అధిగమిస్తామని ఆయన ఉద్ఘాటించారు. ఈ దూరదృష్టితో కూడిన ప్రణాళికలో యువత శక్తి, ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి ప్రధాన స్రవంతిలో ఏకీకృతం చేయడంపై ప్రధాని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. తన 12 ఏళ్ల పదవీకాల విజయాలను ప్రస్తావిస్తూనే, స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరును ఆయన విమర్శించారు..
సప్తధార ద్వారా నూతన లక్ష్యాల సాధన
ఎర్రకోట వేదికగా ప్రధాని మాట్లాడూతూ, “ఈ రోజు సప్తధార అనే ఏడు శక్తి వనరులను సద్వినియోగం చేసుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాను. గత ఐదు నుండి ఏడు దశాబ్దాలలో సాధించలేని కార్యాలను రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాలలో సాధిస్తాం. ఈ ఏడు ధారల సామర్థ్యంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం. నూతన ఉత్తేజంతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా వాటిని అధిగమించేలా దేశాన్ని శక్తివంతం చేస్తాం. అదే సమయంలో దేశ నిర్మాణంలో యువత అపార సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తాం. వారి శక్తి, ప్రతిభను బలమైన, సమర్థవంతమైన వికసిత భారత్ నిర్మాణంలో మళ్లిస్తాం” అని స్పష్టం చేశారు.
సప్తధారలోని 7 కీలక అంశాలు
- తయారీ సామర్థ్యం (Manufacturing Capacity):
మొదటి శక్తి మన తయారీ సామర్థ్యం. డిజైన్ నుండి తయారీ వరకు ఒక సంపూర్ణ విలువ గొలుసును (value chain) నిర్మించాలి. ప్రపంచానికి నమ్మదగిన గ్లోబల్ సప్లై చైన్ భాగస్వామిగా భారతదేశం నిలవాలి. వ్యయం, నాణ్యత, ఉత్పత్తి స్థాయి (scale) విషయాలలో ప్రపంచ ప్రమాణాలను అందుకోవాలి. - వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture , Food Production):
రెండవ శక్తి వ్యవసాయం, ఆహార ఉత్పత్తి రంగాలు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు విస్తరిస్తున్నాయి; స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) ద్వారా బహుళ రకాల కొత్త మార్కెట్లకు ప్రాప్యత లభిస్తోంది. మన సుగంధ ద్రవ్యాలు, చిరుధాన్యాలు (millets) ప్రపంచ స్థాయి బ్రాండ్లుగా మారాలి. - సాంకేతికత, ఆవిష్కరణలు (Technology , Innovation):
మూడవ శక్తి సాంకేతికత, ఆవిష్కరణలు. ఇది రోబోటిక్స్, ఏఐ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్షం, డేటా సెంటర్ల యుగం. నూతన సాంకేతికతలు కొత్త సవాళ్లను తెస్తాయి. కాబట్టి మన దేశం ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారాలి. యూపీఐ (UPI), డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా ఇప్పటికే మన బలాన్ని నిరూపించుకున్నాం. ఇప్పుడు తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో ముందుకు అడుగు వేయాలి. - గతి-శక్తి (Gati-Shakti):
నాలుగవ శక్తి గతి-శక్తి—అంటే దేశవ్యాప్తంగా వేగవంతమైన, నిరాటంకమైన అనుసంధానం. నిరంతర హై-స్పీడ్ రైలు అనుసంధానం, ఆధునిక రహదారులు, అంతర్గత జలమార్గాలు, విమానాశ్రయాలు, మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్లు, ఓడరేవులు మనకు అత్యంత అవసరం. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. - రక్షణ ఉత్పత్తి (Defense Production):
ఐదవ శక్తి రక్షణ రంగానికి సంబంధించింది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే స్థాయికి ఎదగడమే ప్రధాన లక్ష్యం. - హరిత, నీలి ఆర్థిక వ్యవస్థ (Green , Blue Economy):
ఆరవ శక్తి హరిత (గ్రీన్), నీలి (బ్లూ) ఆర్థిక వ్యవస్థలు. ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు చూపుతూనే, భారతదేశం గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి, శక్తి నిల్వ రంగాలలో గ్లోబల్ లీడర్గా ఎదగాలి. అలాగే మత్స్య పరిశ్రమ, తీరప్రాంత పర్యాటకం, సముద్ర సాంకేతికతతో కూడిన నీలి ఆర్థిక వ్యవస్థ దేశ వృద్ధికి కొత్త మార్గాలను సుగమం చేస్తోంది. - సాఫ్ట్ పవర్ (Indias Soft Power):
ఏడవ శక్తి భారతీయ మృదుశక్తి (Soft Power). నేడు యోగా సమస్త ప్రపంచాన్ని భారతదేశంతో అనుసంధానించింది. ప్రపంచ రంగానికి యోగా ఒక గొప్ప శక్తి వనరుగా, మన దేశంపై విశ్వసనీయత పెంచే ప్రధాన అంశంగా నిలుస్తోంది.