HomeNewsకరోనా పై యుద్ధంలో మోడీ దేశానికి కొండంత అండ

కరోనా పై యుద్ధంలో మోడీ దేశానికి కొండంత అండ

విపత్తు సమయంలో మోడీ ప్రధానిగా ఉండడం దేశ ప్రజల అదృష్టం
ప్రభుత్వాలకు సహకరించడం ద్వారానే కరోనాను ఎదుర్కోగలం*

ప్ర‌జాప‌క్షం/హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నమో జ్యోతి కార్యక్రమం విజవంతమైంది. మనల్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా నుండి విముక్తి చేయాలని అన్ని జిల్లాల్లో కార్యకర్తలు తమ ఇంటి ముంగిట జ్యోతి వెలిగించి దేవుణ్ణి ప్రార్ధించారు. అనంతరం ప్యాకేజి ద్వారా 99 శాతం మంది పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినందుకు తమ కుటుంబసభ్యులతో కలిసి కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖంగా కరీంనగర్ లోని నివాసంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్ లోని తార్నాక లో ఉన్న నివాసంలో శ్రీ ఎన్. రామచందర్ రావు,బిజెపి శాసనమండలి నాయకులు, శ్రీ పి. సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, శ్రీ బి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మంత్రి శ్రీనివాసులు తదితరులు నమో జ్యోతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు తమ సమీపంలో ఉన్న పేద ప్రజలకు తమ ఇళ్ల వద్ద భోజన ఏర్పాట్లు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

నమో జ్యోతి కార్యక్రమం అనంతరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా పై పోరాటంలో కార్యకర్తలు మోడీకి అండగా నిలవాలన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ప్రజలను ఈ విధంగా ఏ నాయకుడు ఆదుకోలేదు అని అన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మోడీ మన దేశ ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల అదృష్టం అని కొనియాడారు. కరోనా పై యుద్ధంలో మోడీ దేశానికి కొండంత అండ అని అన్నారు.

మోడీ ప్రకటించిన ప్యాకేజి వలన రాష్ట్రంలో 59లక్షల మంది జాబ్ కార్డులన్న ఉపాధి హామీ కూలీలకు, ఉజ్వల గ్యాస్ పొందిన 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల కు, 5.5లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు, 50లక్షల మందిరైతులకు లబ్ది చేకూరుతుంది. ఇది పేద ప్రజలకు ఒక గొప్ప భరోసా ఇస్తుందని అన్నారు. ఇవి సరిగా లబ్ధిదారులకు అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు.

ఈ ఆపద సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. బీజేపీ అంటేనే సేవ అనే రీతిలో సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకరికి ఒకరు అండగా నిలవాలన్నారు.

కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి నిర్లక్ష్యం కూడా పనికి రాదని అన్నారు. ప్రభుత్వం అందించే సూచనలు తప్పకుండా పాటించడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని కోరారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను ఎదుర్కోగలుగుతామని అన్నారు.

ఈ విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించటానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పునరుద్ఘాటించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments