శ్రీహరికోట: ఉపగ్రహ ప్రయోగాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) బుధవారం మరో ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి జిఎస్ఎల్వి-ఎఫ్11 ఉపగ్రహం ద్వారా జీశాట్-7ఎ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టడానికి కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించింది. మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 26 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జీశాట్ – 7ఎ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. జీశాట్-7ఎ బరువు 2,250 కిలోలు, ఎనిమిదేళ్ల పాటు సేవలందించనుంది.
జిఎస్ఎల్వి-ఎఫ్11 కౌంట్డౌన్ ప్రారంభం
RELATED ARTICLES