దేశంలో కొత్తగా కరోనాతో మరో 1,085 మంది బలి
24 గంటల్లో 83,347 మందికి పాజిటివ్
56 లక్షలు దాటిన బాధితులు
న్యూఢిల్లీ: భాత్లో ప్రాణాంతక కరోనా వైరస్ కోరలు చాస్తూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూడగా, సోమవారం ఒక్క రోజు మాత్రమే 76 వేలకు లోపు కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా మళ్లీ 80 వేలకు పైగా రికార్డు అయ్యాయి. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 56 లక్షలు దాటింది. రోజుకు దాదాపు 1100 మరణాలు సంభవిస్తుండడం తీవ్రంగా కలచి వేస్తుంది. దేశంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 90 వేలు దాటింది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. గత నాలుగైదు రోజులు నుంచి నిత్యం 90 నుంచి లక్షకుపైగా మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కూడా 24 గంటల వ్యవధిలో దాదాపు 90 వేల మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 46 లక్షలకు చేరవులో ఉంది. ఇక మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,347 మందికి కరోనా సోకింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 56,46,010కు చేరింది. 24 గంటల్లో మరో 1,085 మంది కరోనా కారణంగా బలయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 90,020 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.59 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. కొవిడ్ 19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. కాగా, 24 గంటల్లో 89,746 మంది కరోనాను జయించారు. కొత్త కేసుల కంటే కొత్త రికవరీల సంఖ్య అధికంగా ఉండడం వరుసగా ఇది 5వ రోజు కావడం విశేషం. కొత్త రికవరీలతో కలిపి బుధవారం ఉదయం నాటికి 45,87,613 మంది మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. రికవరీ రేటు 81.25 శాతానికి ఎగబాకింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో 9,63,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో ఈ సంఖ్య 17.15 శాతం మాత్రమేనని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆగస్టు 7న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు దాటింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో, బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. మృతుల సంఖ్యలో మాత్రం భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుంది. రికవరీల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక భారత్లో ఇప్పటివరకు 6,62.79,462 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. మంగళవారం దేశవ్యాప్తంగా 9,53,683 శాంపిళ్లకు కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయట పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.
మహారాష్ట్రలో సగటున నిత్యం 400 మరణాలు
మహారాష్ట్రలో ఇటీవలి కాలంగా నిత్యం 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, గత రెండు రోజుల నుంచి ఆ సంఖ్య కాస్త తగ్గింది. 24 గంటల్లో 18,390 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 392 మంది మత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33,407కు చేరగా, కేసుల సంఖ్య 12,42,770కి పెరిగింది. తమిళనాడులో 24 గంటల్లో 76 మంది మరణించగా, కొత్తగా 5,337 మందికి వైరస్ సోకింది. మొత్తం మృతుల సంఖ్య 8,947, బాధితుల సంఖ్య 5,52,674కు చేరింది. కర్నాటకలో కొత్తగా 83 మరణాలు సంభవించగా, 6,974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 8,228కి, కేసుల సంఖ్య 5,33,850కి చేరింది. ఢిల్లీలో తాజాగా 3,816 మందికి వైరస్ సోకింది. 24 గంటల్లో 37 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,051కి, బాధితుల సంఖ్య 2,53,075కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో 24 గంటల్లో 51 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతులు 5,461కి చేరారు. రాష్ట్రంలో కొత్తగా 7,553 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 6,39,302కు చేరింది. ఉత్తరప్రదేశ్లో మొత్తం మృతులు 5,212 కాగా, కొత్తగా 77 మంది మరణించారు. 5,650 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు 3,64,543 మంది కరోనా బారిన పడ్డారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం మృతులు 4,483 కాగా, తాజాగా 62 మంది చనిపోగా, మొత్తం 2,31,484 మందికి వైరస్ సోకింది. గుజరాత్లో మొత్తం మృతులు 3,352 కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,26,007 కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 1,402 మందికి వైరస్ సోకింది. పంజాబ్లో మృతుల సంఖ్య 2,926 నమోదు కాగా, ఒక్క రోజులో 66 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో మృతుల సంఖ్య 2,035గా ఉండగా, మొత్తం 1,10,711 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో మొత్తం మృతుల సంఖ్య 1,367 నమోదు కాగా, మొత్తం బాధితుల సంఖ్య 1,18,793కు చేరింది. హర్యానాలో మొత్తం మృతులు 1,206 కాగా, బాధితుల సంఖ్య 1,14,870గా, జమ్మూకశ్మీర్లో మొత్తం మరణాలు 1,042 కాగా, బాధితుల సంఖ్య 66,261గా నమోదైంది.
2296 కొత్త కేసులు
మరో 10 మంది మృత్యువాత
కరోనాకు 1062 మంది బలి
మొత్తం కేసులు 1,77,070
ప్రజాపక్షం/హైదరాబాద్
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 1,77,070 కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటి వరకు 1062 మంది మృతి చెందారు. 2062 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మంగళవారం నాటి కరోనా హెల్త్ బులెటిన్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. మంగళవారం నాడు 55,892 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇందులో 1388 రిపోర్టులు రావాల్సి ఉన్నది. మొత్తం ఇప్పటి వరకు 26,28,897 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 1,77,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 యాక్టివ్ కేసులు ఉండగా గృహ, ఇతర సంస్థలలో 23,527 మంది ఐసోలేషన్లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారు రాష్ట్ర స్థాయిలో 82.52 శాతం ఉండగా జాతీయ స్థాయిలో81.23 శాతం మంది కోలు కున్నారు. అలాగే కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.59 శాతం కాగా జాతీయ స్థాయిలో 1.59 నమోదైంది.
జిల్లాల వారీగా కొత్త కేసులు
మంగళవారం నాడు ఆదిలాబాద్లో 18, భద్రాద్రి-కొత్తగూడెంలో 77, జిహెచ్ఎంసిలో 321, జగిత్యాలలో 50, జనగామలో 36, జయశంకర్ భూపాల్పల్లిలో 11, జోగులాంబ గద్వాల్లో 21,కామారెడ్డిలో 77, కరీంనగర్లో136, ఖమ్మంలో 69, కొమురంభీమ్ ఆసిఫాబాద్లో 16, మహబూబ్నగర్లో 31, మహబూబాబాద్లో 72, మంచిర్యాలలో 37, మెదక్లో 23, మేడ్చల్-మల్కాజిగిరిలో 173, ములుగులో24, నాగర్కర్నూల్లో 36, నల్లగొండలో 155, నారాయణపేట్లో 6, నిర్మల్లో 19, నిజామాబాద్లో82, పెద్దపల్లిలో40, రాజన్న సిరిసిల్లాలో 67, రంగారెడ్డిలో 217, సంగారెడ్డిలో 81, సిద్దిపేటలో 92, సూర్యాపేటలో 73, వికారాబాద్లో 23, వనపర్తిలో 37, వరంగల్ రూరల్లో 30, వరంగల్ అర్బన్లో 99, యాదాద్రి -భువనగిరిలో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.