ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల
ప్రజాపక్షం / హైదరాబాద్ కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిఎం ఆదేశాల మేరకు రాష్ర్ట ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేస్తూ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయా జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ల పరిధుల్లో ఏర్పాటైన కొత్త మండలాలు :
నారాయణ పేట జిల్లా రెవిన్యూ డివిజన్ పరిధిలో గుండుమల్, కొత్తపల్లె మండలాలుగా ఏర్పడనున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవె న్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్, నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సాలూర, మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో సీరోల్, నల్లగొండ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలోని గట్టుప్పల్, సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న డోంగ్లి, జగిత్యాల జిల్లా జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎండపల్లి, జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిధిలోని భీమారం నూతన మండలాలుగా ఏర్పాటు కానున్నాయి.
13 కొత్త మండలాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
RELATED ARTICLES