HomeNewsBreaking Newsసురేశ్‌ రైనా అరెస్టు

సురేశ్‌ రైనా అరెస్టు

ముంబయి: ముంబయిలోని ఓ పబ్‌పై పోలీసులు సోమవారం రాత్రి రెయిడ్‌ చేశారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి పబ్‌ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 34 మందిపై కేసు నమోదు చేశారు. దాంట్లో సెలబ్రిటీలతో పాటు పబ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ను కూడా అరెస్టు చేశారు. 27 మంది కస్టమర్లు, ఏడుగురు సిబ్బందిపై కేసు దాఖలు చేశారు. ముంబయి విమానాశ్రయం సమీపంలో ఉన్న సహర్‌ ప్రాంతంలో ఆ పబ్‌ ఉన్న ది. నిర్ణీత సమయం దాటి పబ్‌ను ఓపెన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మాస్క్‌లు ధరించకపోవడం, సోషల్‌ డిస్టాన్స్‌ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారు. ప్రస్తుతం ముంబయిలో రాత్రి 11.30 వరకే పబ్‌లకు తెరిచే పర్మిషన్‌ ఉన్నది. కానీ సహర్‌ ప్రాంతంలోని పబ్‌ తెల్లవారుజామున 4 గంటలకు కూడా తెరిచి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ముంబయి పోలీసు శాఖకు చెందిన స్పెషల్‌ స్కాడ్‌ ఆ పబ్‌పై తనిఖీ నిర్వహించారు. తాజాగా కరోనా నిబంధనల నేపథ్యంలో రాత్రి పూట 11 నుంచి ఉదయం 6 వరకు మహారాష్ట్రలో కర్ఫ్యూ విధించారు. అయితే ఆ ఆంక్షలను పబ్‌ నిర్వాహాకులు అతిక్రమించినట్లు పోలీసులు చెప్పారు. కాగా, డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో సురేశ్‌ రైనాను అరెస్టు చేశారు. మాజీ క్రికెటర్‌ను ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్‌ చేశారు. అరెస్టు అయిన సెలబ్రిటీల్లో రైనాతో పాటు గురు రాంధ్వా, సుశేన్‌ ఖాన్‌ కూడా ఉన్నారు. అంధేరీలోని హోటల్‌ జెడబ్ల్యు మారియట్‌లో ఆ పబ్‌ ఉన్నది. ఐపిసి 188 సెక్షన్‌, ముంబయి పోలీసు చట్టం, ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ ప్రకారం అరెస్టులు చేశారు. 18, 269, 34 ఐపిసి సెక్షన్లతో పాటు ఎన్‌డిఎంఎ 51 సెక్షన్‌ కింద అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు ప్రకటించారు. జనవరి పదవ తేదీ నుంచి జరగనున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ కోసం రైనా యుపి జట్టు తరపున ఆడనున్నాడు. కాగా, పోలీసులు అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసిన ఘటనపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌రైనా విచారం వ్యక్తం చేశాడు. ఉద్దేశపూర్వకంగా తాను నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపాడు. అలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ముంబయి నగరంలోని నిబంధనలు, సమయం గురించి తనకు అవగాహనలేదని వెల్లడించాడు. ఈ మేరకు అతడి మేనేజ్‌మెంట్‌ బృందం ఓ ప్రకటన విడుదల చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments