చెన్నై: రెండురోజులుగా చెన్నై పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజకీయ అరంగేట్రం చేసిన సినీ అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్లతో కలిసి పనిచేయడంపై ఆయన స్పందించారు. భవిష్యత్తులో తాను వారిద్దరితో కలిసి పనిచేసే అవకాశముందని తెలిపారు. దక్షిణ భారతంపై ఉత్తరాది నేతలకు మరింత అవగాహన ఉండాలని ఈ సందర్భంగా పవన్ అన్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్న సమయంలో సమస్యలు పరిష్కారమయ్యేవని, వారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ దేశ స్ఫూర్తిని అర్థం చేసుకునేవాళ్లన్నారు.
వారిద్దరితో కలిసి పనిచేసే అవకాశముంది
RELATED ARTICLES