జోహెనస్బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్లతో మర్యాదగా మెలగాలని ఆ బోర్డు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ ఆ జట్టు అభిమానులను కోరాడు. కేప్టౌన్ వేదికగా 2018 మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్లో వీళ్లిద్దరూ బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ఇద్దరికీ ఏడాదిపాటు నిషేధం విధించింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో నిషేధం పూర్తిచేసుకున్న ఆసీస్ ఆటగాళ్లు క్రికెట్లో పునరాగమనం చేశారు. అయితే, ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్, ఆ తర్వాత యాషెస్ సిరీస్ సందర్భంగా పలువురు వీక్షకులు ఈ ఆసీస్ ఆటగాళ్లను ఎద్దేవా చేశారు. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత వార్నర్, స్మిత్ దక్షిణాఫ్రికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఎవరైనా మళ్లీ వీళ్లని అవమానిస్తారని భావించిన క్రికెట్ దక్షిణాఫ్రికా తమ అభిమానులకు ఈ విధంగా విజ్ఞప్తి చేసింది. ’దక్షిణాఫ్రికా అభిమానులకు ఒకటే విన్నవిస్తున్నా.. మన ప్రత్యర్థులను గౌరవించాలి. అంతకుమించి ఇతర విషయాల జోలికి వెళ్లొద్దు. మైదానంలో మాత్రమే పోటీ ఉండాలి. బయట మనకు అలా ఉండకూడదు. క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన ఉండరాదు’ అని జాక్వెస్ ఫాల్ పేర్కొన్నాడు. గతంలో జరిగింది దురదృష్టకరమని, ఇప్పుడీ క్రికెటర్లను అవమానించ వద్దని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తే స్టేడియం నుంచి బయటకు వెళ్లగొడతామని హెచ్చరించాడు.
వారికి రెస్పెక్ట్ ఇవ్వండి!
RELATED ARTICLES