మంత్రుల నివాసాల ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల యత్నం
అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు
విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రజాపక్షం/హైదరాబాద్
విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో శాంతియుతంగా విద్యా సంస్థలను బంద్ చేయిస్తున్న విద్యార్ధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు ముం దు విరించి హస్పిటల్ సిగ్నల్ నుండి ర్యాలీగా చేరుకున్న విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా
పిడిగుద్దులతో దాడికి పాల్పడినట్లు విద్యార్థులు తెలిపారు.
అమలు కాని మధ్యాహ్న భోజన పథకం
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు పుట్టా లక్ష్మణ్ (ఎఐఎస్ఎఫ్), ఆర్.ఎల్. మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ), పరుశురాం (పిడిఎస్యు), ఎస్.నాగేశ్వర రావు, రామకృష్ణ(పిడిఎస్యు), మహేష్(పిడిఎస్యు), మల్లేష్(ఎఐడిఎస్ఓ), గవ్వ వంశీధర్ రెడ్డి (ఎఐఎస్బి), మురళీ (ఎఐఎఫ్డిఎస్), విజయ్ (పిడిడిస్యు(వి) మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. హస్టల్స్, గురుకులాలకు నోట్ పుస్తకాలు పంపిణి చేయలేదన్నారు. సోంత భవనాలు లేకుండా గురుకులాలు చాలిచాలని సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు. నాణ్యమైన భోజనం అందించలేడంలేదన్నారు. కెజిబివిలు, మోడల్ స్కూల్స్ టీచర్స్ లేరన్నారు. రాష్ట్రంలో 24 వేల టీచర్స్ పోలీస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. మధ్యాహ్నం భోజనానికి నిధులు విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్రంలో బిల్లులు రాక భోజనం పెట్టకుండా బందైన పాఠశాలలు అనేకం ఉన్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని 2018 ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ఈ సంవత్సరం చాలా కళాశాలలో ల్యాబ్స్, లైబ్రరీ, అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు చేరలేదన్నారు. మన ఊరు -మన బడి, మన బస్తీ – మన బడి పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేయాలన్నారు.
కార్పొరేట్ ఫీజుల దందాను అరికట్టని సర్కార్
రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. లక్షల రూపాయలు ఫీజులు, డోనేషన్ల పేరుతో దోచుకుంటున్న కనీసం ప్రభుత్వం తల్లిదండ్రులకు భరోనిచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 5,177 కోట్లు పెండింగ్ ఫీజు రీయంబర్స్, స్కాలర్షిప్లు గత ఐదు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని విడుదల చేయకుండా ప్రభుత్వం కావాలనే పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బడ్జెట్ పాఠశాలలకు ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరిగా కమర్షియల్ ట్యాక్స్, విద్యుత్ బిల్లులు, తాగునీటి బిల్లులు కూడా కమర్షియల్ పరిధిలోని నుండి డోమెస్టీక్ పరిధిలో మార్చాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ తన మానస పుత్రిక గురుకుల పథకం అని ప్రకటించారని, కానీ ఎక్కడ ఎమి డైట్ ఛార్జీలు అమలు కావడం లేదన్నారు.
పోలీసుల దాడులకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు
మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో ఈ బంద్ మాత్రమే కాకుండా రానున్న కాలంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బంద్ పాటించాలని కోరిన వామపక్ష విద్యార్థి సంఘాలు నాయకులపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం బౌన్సర్లు పెట్టి దాడి చేయించిందన్నారు. ఈ దాడిని ఖండించారు. పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో తాటికొండ రవి, బి.శంకర్, కె.అశోక్ రెడ్డి, లెనిన్, రమేష్, స్టాలిన్, శ్రీమాన్, క్రాంతి గ్యార, రెహామాన్, హరీష్, అన్వర్, వినయ్, గణేష్, నాగరాజు, సైదులు, యశ్వంత్, గడ్డం శ్యామ్, గణేష్, గౌతమ్, ఆసిఫ్, రాజు, అరవింద్ రెడ్డి, అఖిల్, అవినాష్, ప్రతిభ, వెంకటేశ్, సృజన్, ఉషాశ్రీ, అనిల్, సుమంత్, పవిత్ర, తిరుపతి, పాషా, భాను, నవీన్, సాయి తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.