ప్రజాపక్షం / హైదరాబాద్ : ఆగస్టు వరకూ రైళ్లు పూర్తిస్థాయిలో నడిచే అవకాశాలు లేవని తెలుస్తోంది. పూర్తి నిబంధనలతో దేశీయ విమానాల రాకపోకలకు అనుమతులు లభించినప్పటికీ రైళ్లకు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకూ అనుమతులు ఇచ్చే అవకాశం లేదని రైల్వే అధికారులు అంటున్నారు. ఏప్రిల్ 14 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేయాలని ఇప్పటికే అన్ని జోన్ల అధికారులకు రైల్వే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా వీరందరికీ కూడా డబ్బును రిఫండ్ చేసేయాలని సూచించారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొన్ని రైళ్లను ప్రత్యేక రైళ్లుగా గుర్తిస్తామని, అంతేకాకుండా 230 మెయిల్స్తో పాటు ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా నడుస్తున్నాయని అధికారులు ఓ నివేదికలో పేర్కొన్నారు. సాధారణంగా 120 రోజుల ముందు నుంచే టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనల ప్రకారం మాత్రం రైల్వే శాఖ గనుక రైళ్లను రద్దు చేస్తే ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వారి డబ్బులు కూడా చెల్లిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
రెగ్యులర్ రైళ్లు ఆగస్టు వరకు బంద్
RELATED ARTICLES