రైతులకు ఆర్బిఐ వరం
వ్యవసాయ రుణాల సమస్యలపై అంతర్గత వర్కింగ్ గ్రూపు ఏరాటు
ముంబయి: రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్లో సరికొత్త పథకం తీసుకొచ్చారు. పేద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6,000 అందజేయనున్నట్లు బడ్జెట్ ప్రసం గం సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయ ల్ ప్రకటించారు. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రైతులకు మరో కానుక అందిస్తోంది. హామీ అవసరం లేకుండా ఇచ్చే వ్యవసా య రుణాల పరిమితిని రూ.1లక్ష నుంచి 1.60 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది. ఇంతే కాకుండా వ్యవసాయ రుణాల సమస్యలను పరిశీలించడానికి అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏరాటు చేయనున్నట్లు కూడా ఆర్బిఐ గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బిఐ గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగావ్యవసాయ రుణాల అంశాన్ని ప్రస్తావించింది. ‘ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ఆర్బిఐ పేర్కొంది. పేద రైతులకు మద్దతుగా రూ. 75,000 కోట్ల రూపాయాలను( 10.50 బిలియన్ డాలర్లు) ఇస్తామని, మధ్య తరగతిపై పన్ను భారాన్ని తగ్గిస్తామని కూడా ఆర్బిఐ పేర్కొంది. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకులకు నోటీసు జారీ చేయనుంది.