తొమ్మిదేళ్ళలో 1.31 కోట్ల నుండి 2.20 కోట్ల ఎకరాలకు పెంపు
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.59లక్షల కోట్లు ఖర్చు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలో 1.31 కోట్ల నుండి 2.20 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తొమ్మిదేళ్లల్లో రూ.1.59 లక్షల కోట్లను ఖర్చు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు కాలంలో పూర్తి చేశామని, మిషన్ కాకతీయ కింద రూ రూ.5249 కోట్లను ఖర్చు చేశామని వివరించింది. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించింది. విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా 2022- నాటికి 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు, ఆలాగే 2014 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022- నాటికి రికార్డు స్థాయిలో సుమారు 2.70 కోట్ల టన్నులకు చేరుకున్నది. 2014- లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాల నుండది 2020 నాటికి (44.70 శాతం వృద్ధి) 18.70 లక్షల ఎకరాలు పెరిగి 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నది. 2014- పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, 2020-21 నాటికి 63.97 లక్షల బేళ్లకు చేరుకున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ. 1 లక్షా 33 వేల కోట్ల ను భరించి, 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపింది. అలాగే ధాన్యంతో పాటు రూ.11,437.55 కోట్లతో ఇతర పంటల ను కూడా కొనుగోలు చేసింది. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నది. 27.49 లక్షల వ్యవసాయ కనెక్షన్లు కు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. అందుకు అనుగుణంగా రూ.32,700 కోట్లు వెచ్చించి, విద్యుత్ మౌళిక సదుపాయాలు విస్తరించింది. ఉచిత విద్యుత్ సరఫరా కు సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తున్నది. వడ్డీ వ్యాపారులు కభంద హస్తాల నుంచి రైతులను కాపాడేందుకు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పు నగటు 10 విడతలలో రూ.65 వేల 190 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసింది.11 వ విడతగా ఈ వానాకాలంలో ఇప్పటివరకు 64.49 లక్షల రైతులకు, 117.08 లక్షల ఎకరాలకు, రూ.5854.16 కోట్లు ను రైతు బంధు సాయం గా అందించింది. రైతులకు అప్పుల బాధ నుండి విముక్తి కలిగించేందుకు రైతు రుణ మాఫీని ప్రభుత్వం అమలచేస్తున్నది.
ఇప్పటి వరకు రెండు విడతలలో రూ.17,351.47 కోట్లు రుణమాఫీ చేసింది. రూ 1 లక్ష వరకు రుణ మాఫీ చేసేందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవలనే రూ 18 వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. మృతి చెందిన రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు బీమా అమలు చేస్తున్నది. రైతు బీమా కింద 1,08,051 మంది రైతు కుటుంబాలకు రూ.5402’55 కోట్ల భీమా పరిహారం చెల్లించారు. వ్యవసాయ రంగం పునరుజ్జీవనంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 2014- రూ.1,12,162/ ఉండగా,2022 (అంచనా):రూ.3,17,115/లకు పెరిగింది.
ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓ
ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ. 572 కోట్లతో 2601 రైతు వేదికలను నిర్మించారు.సీజన్కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50శాతం తెలంగాణాలోనే ఉత్పత్తి అవుతున్నాయి.ఇప్పటి వరకు రూ. 928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా చేసింది. విత్తనాల నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నది.‘ పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం గా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం రూ.963.26 కోట్లను వెచ్చించి 6.66 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చారు. వ్యవసాయ ట్రాక్టర్లు 2014 94,537 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3.52 లక్షలకు చేరింది. 2014- 6,318 హార్వెస్టర్లు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 19,309 లకు చేరాయి.తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు చేసింది. గోడౌన్ల సామర్థ్యం -2014 39.01 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, ప్రస్తుతం 73.82 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.‘ 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నది‘ సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి మార్కెట్ రీసర్చ్,అనాలసిస్ వింగ్ను ఏర్పాటు చేసింది‘ సూక్ష్మ సేద్యం ద్వారా రూ.2186.14 కోట్లతో సబ్సిడీతో 3.10లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చారు. .రూ. 291.66 కోట్ల సబ్సిడితో 1324 ఎకరాలలో, 1190 రైతుల పాలీహౌజ్ ల అభివృద్ధి చేసింది.పంట నష్ట పరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1490.15 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ గా చెల్లించినట్టు ప్రభుత్వం పేర్కొంది. పంట భీమాలో రాష్ట్ర వాటా రూ. 909.55 కోట్లు (2014- నుండి 2019- వరకు) భరించింది‘ ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తున్నది. 2022 లోనే 82,372 ఎకరాలలో నూతనంగా ఆయిల్ పామ్ సాగు చేశారు.సాగు నీటి శిస్తు ను ప్రభుత్వం రద్దు చేసింది