కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు
న్యూ ఢిల్లీ: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ముంగిట అస్గర్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన అ ఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ).. గుల్బుద్దీన్కి పగ్గాలప్పగించిన సంగతి తెలిసిందే. కానీ.. వరల్డ్ప్లో టీమ్ కనీసం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోవడంతో ఆ తర్వాత ఆ జట్టు బౌలర్ రషీద్ ఖాన్ని కెప్టెన్గా నియమించింది. తాజాగా మళ్లీ అస్గర్ని కెప్టెన్గా నియమిస్తూ ఏసీబీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అస్గర్, గుల్బుద్దీన్ కెప్టెన్సీలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన అఫ్గానిస్థాన్ టీమ్.. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో మెరు గ్గా ఆడింది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో గట్టి పోటీనిచ్చిన ఆ జట్టు.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 2-1తో సిరీస్ విజయాన్ని నమో దు చేసింది. కానీ.. అనూహ్య రీతిలో రషీద్ ఖాన్ ని కెప్టెన్సీ నుంచి ఏసీబీ తప్పించింది. దీంతో.. అభిమానులు తీవ్ర స్థాయిలో ఏసీబీపై మండిపడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో అఫ్గానిస్థాన్ పేరు గత రెండేళ్లుగా వినిపిస్తోందంటే దానికి కారణం రషీద్ ఖాన్ అంటే అతిశయోక్తి కాదే మో..! ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కి ఆ డుతున్న ఈ మేటి స్పిన్నర్.. తన అద్భుతమైన బౌలింగ్తో జట్టుకి ఒంటిచేత్తో విజయాల్ని అందిస్తూ వస్తున్నాడు. అతని వయసు 21 ఏళ్లే కావడంతో.. అఫ్గానిస్థాన్ టీమ్ని సుదీర్ఘకాలం నడిపించగలడని అంతా ఊహించారు. కానీ.. ఏసీబీ అతనికి ఊహించని రీతిలో షాకిచ్చింది.
రషీద్ ఖాన్కు డిమోషన్
RELATED ARTICLES