HomeNewsBreaking Newsయు ముంబా జయభేరీ

యు ముంబా జయభేరీ

పుణెరీ జట్టుపై 10 పాయింట్ల తేడాతో గెలుపు
పుణెకు ఇది రెండో ఓటమి
ముంబయి: ప్రొ కబడ్డీ సీజన్‌ యు ముంబా విజయాల పరంపర కొనసాగిస్తోంది. సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో యు ముంబా అదరగొట్టింది. సుర్జీత్‌ సింగ్‌ సారథ్యంలోని పుణెరీ పల్టన్‌ను యు ముంబా బోల్తా కొట్టించి విజయం సాధించింది. శనివారం ముంబై ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 33 తేడాతో పుణెరీ పల్టన్‌పై విజయాన్ని అందుకుంది. దీంతో పుణెరి ఖాతాలో రెండో ఓటమి పడింది. తొలి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరంభంలో ధాటిగా ఆడిన పుణెరి ఆటగాళ్లు.. మ్యాచ్‌ జరిగే కొద్దీ ఢీలా పడ్డారు. ప్రత్యర్థి జట్టుకు దాసోహమయ్యారు. రైడింగ్‌లో, టాకిల్‌లో పూర్తిగా విఫలమయ్యారు. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్ల వేగం తగ్గింది. అయితే రెండో అర్ద భాగంలో యు ముంబా ఆటగాళ్లు విరుచుకపడ్డారు. ఇక ఈ మ్యాచ్‌లో యు ముంబా ఆటగాళ్లు ఒకరిపై ఆధారపడకుండా సమిష్టిగా ఆడారు. రైడర్లు అభిషేక్‌ సిం గ్‌(5), రోహిత్‌ బలియాన్‌(4) రాణించగా.. డిఫెండర్లు సురిందర్‌ సింగ్‌(4), సందీప్‌ నర్వాల్‌(4), ఫజల్‌ అత్రచలి(4) పుణెరి పని పట్టారు. ఇక పుణెరీ ఆటగాళ్లలో సారథి సుర్జీత్‌ సింగ్‌(4) ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు స్టార్‌ డిఫెండర్‌ గిరీష్‌ ఎర్నాక్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క టాకిల్‌ కూడా చేయలేకపోయాడు. ముంబా జట్టు 15 రైడ్‌, 12 టాకిల్‌ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 12 రైడ్‌, 11 టాకిల్‌ పాయింట్లు మాత్రమే సాధించింది. యు ముంబా ధాటికి పుణెరి పల్టాన్‌ జట్టు రెండు సార్లు ఆలౌటైంది.
ప్రత్యేక ఆకర్షణగా కోహ్లీ..
వరుస క్రికెట్‌తో బిజీబిజీ అయిన భారత క్రికెట్‌ జట్టు సారధి విరాట్‌ కోహ్లీ కాస్తా విరామం దొరకడంతో ప్రొకబడ్డీ మ్యాచ్‌లు వీక్షించడానికి వచ్చేశాడు. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కాగా, ప్రొకబడ్డీ మ్యాచ్‌లకు కోహ్లీ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జైపూర్‌ పాంతర్స్‌కు రెండో గెలుపు
ప్రొకబడ్డీ లీగ్‌లో జైపూర్‌ పింక్‌ పాంతర్స్‌ రెండో విజాయాన్ని న మోదు చేసింది. ఇక్కడి ఎస్‌బిఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో బెంగాల్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2 పాయింట్ల తేడాతో గెలుపొందింది. సందీప్‌ దుల్‌(8), దీప క్‌ హుడా(6), దీపక్‌ నర్వాల్‌(4) పాయింట్లతో రెచ్చిపపోవంతో నిర్ణిత సమయానికి జైపూర్‌ జట్టు 27 పాయింట్లతో ఆధిఖ్యంలో నిలిచింది. దీంతో 27 పాయింట్లతో ఈ మ్యచ్‌ను జైపూర్‌ కైవసం చేసుకుంది. ప్రపంజన్‌(7), మహేందర్‌ సింగ్‌(6), బల్‌దేవ్‌ సింగ్‌(6)లు రాణించినా మిగతావారు పా యింట్లు రాబట్టక పోవడంతో నిర్ణిత సమయానికి 25 పాయింట్లు చేసిన బెం గాల్‌ జట్టు ఓటమి పాలైంది. ఈ సీజన్‌ బెంగాల్‌ జట్టుకు ఇది తొలి ఓటమి.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments