కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు ఆదేశం
ప్రజాపక్షం/వరంగల్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విష యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇరిగేషన్ అధి కారులకు ఆదేశించారు. మంగళవారం ముఖ్య మంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సంద ర్శించారు. తొలుత మేడిగడ్డ బ్యారేజీ వద్దకు కాలి నడకన వెళ్లారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గోలివాడ పంప్హౌజ్కు వెళ్లా రు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విష యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రా మిక అవసరాలు సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నం దుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడి గడ్డ బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచి ఉండటంతో రివర్ బేసిన్ ను పరిశీ లించేందుకు ఉన్నతాధికారులతో కలిసి రెండు హెలికాప్టర్లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. తొలుత సిఎం కెసిఆర్ మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ పొడవునా చాలా దూరం కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి మాత కు పూలు, పసుపు, కుంకుమతో కూడిన వాయి నం సమర్పించారు. అనంతరం నాణాలను నది లోకి జారవిడిచారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ఎగువన ప్రాణహిత నుండి వస్తున్న వరద వివ రాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో మేడిగడ్డ నుండి కిందికి ఎంత వరద వెళ్లింది అని అధికారులను అడిగారు. ఈ సీజన్లో 300 టిఎంసిల నీరు కిందికి వెళ్లినట్లు అధికారులు సిఎంకు వివరించారు. పైనుంచి వచ్చే వరదకు అనుగుణంగా గేట్లను ఎత్తాలని వీలు న్నంత వరకు నదిలో నీటిమట్టాన్ని పరిశీలించా లని అధికారులకు సూచించారు. గోదావరిలో మొత్తం ఫ్లడ్స్ తగ్గిన తర్వాత గేట్స్ మూసి వేయాలని సిఎం సూచించారు.మేడిగడ్డ బ్యారేజిని సకాలంలో నిర్మించి ఈ సీజన్కు అందించిన ఎల్ అండ్టి సంస్థను, ఇరిగేషన్ అధికారులను ముఖ్య మంత్రి అభినందించారు. ఆ తర్వాత ఇటివల నిర్వహించిన యాగశాల వద్దకు చేరుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల నుండి వినతి పత్రాలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, ఇరిగేషన్ కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఓఎస్డీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ వి. వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈ ఎన్సీ మురళీధర్ రావు, ఈఈ రమణ రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రతినిధి రాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకునే ముందు వరకు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకునే సమయంలో వర్షం తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గోలివాడకు బయలుదేరిన తర్వాత మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాంతంలో మళ్లీ భారీ వర్షం కురిసింది.