ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన మంజురాణి
ఈసారీ మెరీకి రజతంలో సరి
ఉలాన్ ఉడే : భారత యువ బాక్సర్ మంజురాణి సంచలనం సృష్టించింది. రష్యాలోని ఉలాన్ ఉడే జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో ఫైనల్లోకి దూసుకెల్లింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్షిప్స్ 48 కేజీల విభాగంలో ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి రాక్షత్ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. హరియాణాకు చెందిన ఆమె క్వార్టర్స్లో ఉత్తరకొరియా బాక్సర్ను ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జ మెమొరియల్ బాక్సింగ్ పోటీల్లో ఆమె రజత పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత మరో బాక్సర్ జమునా బోరో ప్రపంచ ఛాంపియన్స్షిప్స్ 54 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి చేతిలో 0-5తేడాతో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ కూడా సెమీస్లో ఓడిన సంగతి తెలిసిందే. 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ చేతిలో 1-4 తేడాతో ఓడి కాంస్యం పతకాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్స్షిప్స్లో ఎనిమిది పతకాలు సాధించిన బాక్సర్గా మేరీకోమ్ రికార్డు సృష్టించింది. ఆమె ఆరు పసిడి, ఒక రజతం, మరో కాంస్యం గెలుచుకుంది.
మేరీకి రజతం
కాగా, భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సెమీస్లో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం నిర్వహించిన సెమీస్లో.. 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ క్యాకిరోగ్లు చేతిలో మేరీ 1–4 తేడాతో ఓటమిచెందారు. ఈ ఫలితంపై భారత్ అప్పీల్ చేసినా ఉపయోగం లేనట్లు తెలిసింది. టర్కీ బాక్సర్.. మేరీకోమ్పై స్పష్టమైన పంచ్లు విసరడంతో భారత అప్పీల్ టర్న్డౌన్ అయ్యిందని సమాచారం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మేరీ ఇప్పటివరకు ఎనిమిది పతకాలు సాధించింది. ఈ ఈవెంట్ చరిత్రలో ఇన్ని పతకాలు సాధించిన తొలి బాక్సర్గా మేరీ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో మొత్తం ఆరు బంగారు పతకాలు సాధించిన ఆమె ఒక రజతం, మరో కాంస్యం గెలుపొందారు.