HomeNewsBreaking Newsభారత్‌లో వరల్డ్‌కప్‌ ఆడబోం: పాక్‌

భారత్‌లో వరల్డ్‌కప్‌ ఆడబోం: పాక్‌

కరాచీ : పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వసీం ఖాన్‌ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో బంగ్లాదేశ్‌తో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. పాకిస్తాన్‌ మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆసియా కప్‌కు ఆతిథ్యం వహించనుంది. ఈ క్రమంలో భారత్‌.. పాకిస్తాన్‌లో పర్యటించేందుకు నిరాకరిస్తే తాము టి20 వరల్డ్‌కప్‌ 2021 ఆడేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు. ’ఇది పిసిబి లేదా ఐసిసి పంతం కాదు. వేదిక మార్చాలంటే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ మీద ఆధారపడి ఉంటుంది’ అని వసీం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘ఈ టోర్నమెంట్‌కు రెండింటిలో ఒకదానిని వేదికగా ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఈ మ్యాచ్‌ లలో భారత్‌ ఆడేందుకు నిరాకరిస్తే టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో ఆడేందుకు మేం కూడా సుముఖంగా లేము’ అని ఆయన అన్నాడు. ఈ నెలారంభంలో బంగ్లాదేశ్‌.. పాకిస్తాన్‌ గడ్డపై ఆతిథ్య జట్టుతో ఆడేందుకు ఒప్పుకుంది. ఆసియా కప్‌ ను పాకిస్తాన్‌ లో నిర్వహిస్తున్నందుకే ఈఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపించాయి. 2020 సెప్టెంబరులో ఆసియా కప్‌ను పాకిస్తాన్‌ వేదికగా నిర్వహిస్తే టీ20 వరల్డ్‌ కప్‌ 2021 భారత్‌ లో జరగనుంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments