ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో విస్తృత స్థా యి సమావేశం జరుగుతుం ది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. వారితో ముఖ్యమంత్రి కెసిఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీ గా సాగు చేయాల్సిన పంటలపై చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయిస్తారని సిఎంఒ ఒక ప్రకటనలో వివరించింది
పంటల సాగు విధానంపై 21న కీలక సమావేశం
RELATED ARTICLES