బిపిఎల్ కుటుంబాలకు కొనసాగింపు
దారిద్య్రరేఖ ఎగువ కుటుంబాలు రూ. 100 చెల్లించాలి
పట్టణ ప్రాంతాల్లో భారీగా నల్లా డిపాజిట్లు తగ్గింపు
ఫైలుపై సిఎం కెసిఆర్ సంతకం
ప్రజాపక్షం / హైదరాబాద్ : పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం భారీగా తగ్గించిం ది. రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్) కుటుంబాలు ఒక్క రూపాయి చెల్లిస్తే నల్లా కనెక్షన్ ఇచ్చే పథకాన్ని కొనసాగిస్తూ, (దారిద్య్ర రేఖ ఎగువన ఉన్న) ఇతర కుటుంబాలకు రూ. 100కే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు గురువారం సంతకం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ఇంటికి నల్లా కనెక్షన్ పొందేందుకు రూ.6,000 డిపాజిట్ తీసుకుంటున్నారు. ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి ప్రస్తు తం రూ.10,500 డిపాజిట్ తీసుకుంటున్నారు. అంత పెద్ద మొత్తంలో డిపాజిట్ రుసుము ఉండ డం వల్ల పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని సిఎం కెసిఆర్ భావించారు. “మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభు త్వం ప్రజలకు కల్పిస్తున్నది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే, డిపాజిట్ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లా కనెక్షన్ డిపాజిట్ను తగ్గిస్తున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని, మిషన్ భగీరథ ద్వారా అందే శుద్ధి చేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నాను” అని సిఎం అన్నారు. “రాష్ర్టంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 1.20 లక్షల ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. డిపాజిట్ ఎక్కువగా ఉన్నందు వల్ల మిగతా ఇంటి యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో 6.7 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ లభించలేదు. వీటికి తోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల మందికి నల్లా కనెక్షన్ అందాల్సి ఉంది. అంతా కలిపి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. డిపాజిట్ ఎక్కువ ఉన్నందున వీరు నల్లా కనెక్షన్ తీసుకునేందుకు ముందుకురారు. దీనివల్ల ప్రజలందరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు తాగించాలనే లక్ష్యం నెరవేరదు. అందుకే ఆర్థికంగా భారమైనప్పటికీ మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చెల్లించాల్సిన డిపాజిట్ను నామమాత్రం చేయాలని నిర్ణయించాం. ప్రజలందరూ శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం” అని సిఎం కెసిఆర్ ప్రకటించారు.