రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రామగుండం, పెంబి, బయ్యారంలో 43.4 డిగ్రీలు
జమ్మికుంట మండలం తంగులలో 43.2 డిగ్రీలు
ప్రజాపక్షం/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మూడు ప్రాంతా ల్లో ఆదివారం 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం, నిర్మల్ జిల్లా పెంబి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం బయ్యారం లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తంగులలో 43.2 డిగ్రీలు,నిర్మల్ జిల్లా భైంసాలో 43.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరెళ్లలో 43.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్లో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మడలంలోని భోరజ్లో 43.1 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లాలోని తొర్రూ ర్ లో43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.