రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో పదిహేడు వేల పరుగుల మార్కును చేరడానికి ధోని ఇంకా 33 పరుగుల దూరంలో ఉన్నాడు. రాంచీ వేదిక శుక్రవారం ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడో వన్డేలో ధోని ఈ ఫీట్ను అందుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ధోని (582) అంతర్జాతీయ మ్యాచుల్లో 16,967 పరుగులు చేశాడు. అందులో 16 సెంచరీలు, 106 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మ్యాచుల్ల్లో ధోని సగటు 45.00గా ఉండడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (34,357), రాహుల్ ద్రవిడ్ (24,208), విరాట్ కోహ్లీ (19,453), సౌరవ్ గంగూలీ (18,575), వీరేంద్ర సెహ్వాగ్ (17,253)లు ధోనీ కంటే ముందున్నారు.
ధోనిని ఊరిస్తున్న మరో రికార్డు..
RELATED ARTICLES