రాష్ట్రంలో కొత్తగా 1302 మందికి పాజిటివ్
మరో 9 మంది మృతి
1,72,608కు చేరిన బాధితులు
ప్రజాపక్షం/హైదరాబాద్ గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గింది. కొత్తగా 1302 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,72,608లకు చేరిం ది. మరో 9 మంది మృత్యువాతపడగా ఇప్పటి వరకు 1042 మంది మరణించారు. 2230 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఆదివారం నాటి కరోనా హెల్త్ బులెటిన్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసింది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ 50వేలకు తగ్గకుండా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ గడిచిన 24 గంటల్లో కేవలం 31,095 పరీక్షలను నిర్వహించింది. ఇందులో 1205 రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 25,19,315 నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా 1,72,608 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,41,930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1042 మంది మరణించారు. 29,636 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 22.990 మంది గృహ, ఇతర సంస్థలల ఐసోలేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.60 శాతం కాగా, జాతీయ స్థాయిలో 1.60 శాతం ఉన్నది. అలాగే కరోనా నుంచి కోలుకుటుంటున్న వారు రాష్ట్రస్థాయిలో 82.22 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 79.87 శాతం నమోదైంది. కాగా జయశంకర్ భూపాలపల్లిలో ఒక్క కేసులు కూడా నమోదు కాలేదు. మేడ్చల్ -మల్కాజిగిరి కేవలం 24 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కొత్త కేసులు
ఆదివారం నాడు ఆదిలాబాద్లో 8, భద్రాద్రి -కొత్తగూడెంలో 29, జిహెచ్ఎంసిలో 266, జగిత్యాలలో 34, జనగామలో 18, జయశంకర్ భూపాల్పల్లిలో 0, జోగులాంబ గద్వాల్లో 18, కామారెడ్డిలో 14, కరీంనగర్లో 102, ఖమ్మంలో 35, కొమురంబీమ్ ఆసిఫాబాద్లో 8, మహబూబ్నగర్లో 24, మహబూబాబాద్లో 45, మంచిర్యాలలో 20, మెదక్లో 16, మేడ్చల్- మల్కాజిగిరిలో 24, ములుగులో 15, నాగర్కర్నూల్లో 37, నల్లగొండలో 70, నారాయణపేట్లో 4, నిర్మల్లో 13, నిజామాబాద్లో 50, పెద్దపల్లిలో 20, రాజన్న సిరిసిల్లాలో 23, రంగారెడ్డిలో 98, సంగారెడ్డిలో 54, సిద్దిపేటలో 92, సూర్యాపేటలో 26, వికారాబాద్లో 10, వనపర్తిలో 25, వరంగల్ రూరల్లో 18, వరంగల్ అర్బన్లో 62, యాదాద్రి-భువనగిరిలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తగ్గిన టెస్టులు.. కేసులు
RELATED ARTICLES