రాష్ట్రంలో కరోనాకు మరో 9 మంది బలి
ప్రజాపక్షం/హైదరాబాద్
జిహెచ్ఎంసిలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1873 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 1,24,963 కేసులకు చేరింది. మరో 9 మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం 827 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు ఆదివారం నాటి కరోనా హెల్త్ బులెటిన్ను వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.66 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 1.78 శాతం నమోదైంది. కరోనాతో కోలుకుంటున్నవారి రేటు రాష్ట్ర స్థాయిలో 73.3 శాతం కాగా జాతీయ స్థాయిలో 76.55 శాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 1849 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ సంఖ్య 92,837 మందికి చేరింది. ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులు ఉండగా గృహ, సంస్థలలో ఐసోలేషన్లో 24,216 మంది ఉన్నారు. ఆదివారం ఒక్కరోజే 37,791 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో 800 రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు మొత్తం 13,65,582 వరకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకిన వారిలో 64.41 శాతం ఉండగా, 35.59 శాతం మహిళలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 20,396 బెడ్స్లలో 2705 బెడ్స్లో పేషంట్స్ ఉన్నారు. మిగిలిన 17,691 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కాగా జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట్ జిల్లాల్లో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. టెలి మెడిసిన్, వివిధ సమస్యల పరిష్కారానికి 104కు ఫోన్ చేయాలని, ప్రైవేటు ఆస్పత్రులు,ల్యాబరేటరీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 9154170960 నంబర్కు ఫోన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్లో పేర్కొంది.
జిల్లాల వారీగా కొత్త కరోనా పాజిటివ్ లెక్కలు
ఆదివారం నాడు ఆదిలాబాద్లో 17, భద్రాద్రి- కొత్తగూడెంలో 51, జిహెచ్ఎంసిలో 360, జగిత్యాలలో 77, జనగామలో 34, జయశంకర్ భూపాల్పల్లిలో 1, జోగులాంబ గద్వాల్లో28, కామారెడ్డిలో 25, కరీంనగర్లో 180, ఖమ్మంలో 103, కొమురంబీమ్ ఆసిఫాబాద్లో 21, మహబూబ్నగర్లో 40,మహబూబాబాద్లో 54, మంచిర్యాలలో 48, మెదక్లో 12, మేడ్చల్-మల్కాజిగిరిలో 41,ములుగులో18, నాగర్కర్నూల్లో 36, నల్లగొండలో 79, నారాయణపేట్లో 1, నిర్మల్లో 4, నిజామాబాద్లో 94, పెద్దపల్లిలో 29, రాజన్న సిరిసిల్లాలో 23, రంగారెడ్డిలో 129, సంగారెడ్డిలో 37, సిద్దిపేటలో 85, సూర్యాపేటలో 65, వికారాబాద్లో 15, వనపర్తిలో 32, వరంగల్ రూరల్లో19, వరంగల్ అర్బన్లో 94,యాదాద్రి-భువనగిరిలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.