HomeNewsBreaking Newsకనీస మద్దతు ధర పెంపుస్వల్పం

కనీస మద్దతు ధర పెంపుస్వల్పం

14 రకాల పంటలకు రూ.53 పెంచుతూ కేంద్ర నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. క్వింటాల్‌ వరి ధాన్యంపై రూ.53 పెంపుతో.. తాజా ధర రూ.1,868కి చేరింది. పత్తి మద్దతు ధర రూ.260 పెంపుతో క్వింటాల్‌ పత్తి మద్దతు ధర రూ.5,515కి చేరింది. 2020 పంటకు ఇది వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం సుదీర్ఘంగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియా ముందు వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకానికి రోడ్‌ మ్యాప్‌ రూపొందించామని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతులు, ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో రైతులు, ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. “సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సరికొత్త అర్థాన్ని ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రూ.50వేలకోట్లు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ రంగానికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు మార్కెట్లో లిస్టింగ్‌ చే సే అవకాశం కల్పిస్తున్నాం. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు సత్వరమే రూ.10 వేలు రుణం ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దీని ద్వా రా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. రైతులను ఆదుకునేందుకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పథకం అమల్లోకి తెస్తాం. ఇప్పటికే 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాం’ అని పేర్కొన్నారు. మరో మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ దేశ జీడీపీలో 29% సూక్ష్మ చిన్న పరిశ్రమలదేనని, ఆరు కోట్ల చిన్న పరిశ్రమలు 11 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాయని చెప్పారు. మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న చిన్న పరిశ్రమలను స్టాక్‌ మార్కె ట్లో పెడతామని, వాటిలో కొన్ని షేర్లను ప్రభుత్వం కొని వారికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇక రైతులు తమ రుణాలను చెల్లించే గడువును ఆగస్ట్‌ వరకు పొడిగించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు.
రైతుల జీవితానికి సానుకూల మార్పు : మోడీ
రైతులకు సంబంధించి తాజాగా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు రైతుల జీవితానికి సానుకూల మార్పును తీసుకురాగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. రైతులతోపాటు వీధి వ్యాపారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నడుపుకునే వారికి గొప్ప ప్రయోజనాలు కల్పించే నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు. భారత్‌ను స్వావలంబన సాధించిన దేశంగా రూపొందించాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవన్నారు. వీధి వ్యాపారులకు ఆత్మ నిర్భర్‌ నిధి ఒక ప్రత్యేక పథకంగా మారుతుందన్నారు. ఇది వారి జీవితాలనే మార్చివేస్తుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments