6వ తేదీలోగా మోడీ, షా ప్రసంగాలపై నిర్ణయం తీసుకోండి
న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్య క్షుడు అమిత్ షా ప్రసంగాలపై ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి ప్రసంగాలు ఎన్నికల నియమావళిని ఉల్లఘించేలా ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ నేతలు ఇసికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిం దే. అయితే మోడీ, అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా.. ఇసి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపి సుస్మితా దేవ్ పిటిషన్ దాఖలు చేయడంతో.. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి ఈ తుది గడువు (డెడ్లైన్) విధించింది. ప్రధాని మోడీ, అమిత్ షా లపై వచ్చిన ఫిర్యాదులపై మే6లోపు నిర్ణ యం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసికి అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. మరో 9 ఫిర్యాదులపై మా త్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొం ది. వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామ ని అందుకు సమ యం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరి ంది. ఆదివారం వరకు సమయం ఉన్నందున త్వరగా ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాలని ఇసికి సూచించింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది.