న్యూఢిల్లీ : ఆమ్రపాలి సంస్థతో తలెత్తిన వివాదంలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నాడు. తనకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో పాటు ఓ ఇంటి విషయంలోనూ మోసం చేసిందని ధోని పేర్కొన్నాడు.2009 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా మార్చుకోవడంతోపాటు పలు వ్యాపార విషయాల్లో ఆమ్రపాలి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ధోనీకి చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు. రాంచీలోని అమ్రాపాలి సఫారీలో ధోని ఒక పెంటౌజ్ బుక్ చేసుకున్నాడు. ఆ ఇల్లు విషయంలోనూ ధోనికి యాజమాన్య హక్కులు కల్పించలేదు. అంతేకాదు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ధోని బాధ్యతలను అర్ధాంతరంగా నిలిపివేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. ఆ సంస్థపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఆమ్రపాలి వద్ద ఇల్లు కొనుగోలు చేసిన 46 వేల మంది సంస్థ తమను మోసం చేసిందంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆ సంస్థకు చెందిన ఉప సంస్థలు, డైరెక్టర్ల ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆ సంస్థ మోసం చేసింది
RELATED ARTICLES