భారీగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు బహుతక్కువ
తెలంగాణలో కొత్తగా 1,296 కొవిడ్ 19 కేసులు
జిల్లాల్లో విస్తృతంగా వైరస్ వ్యాప్తి
వరంగల్లో రికార్డుస్థాయిలో పాజిటివ్లు
ఆగస్టు ఆఖరి నాటికి రాష్ట్రంలో లక్ష కేసులు దాటే అవకాశం
ప్రజాపక్షం/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపు తప్పుతోంది. అన్లాక్ 2.0 కొనసాగుతుండటంతో వ్యాధిపై ప్రజల్లో పట్టుతప్పింది. అత్యధిక రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు పరిమితంగా నిర్వహిస్తుండటంతో వైరస్ ప్రభా వం ఏ స్థాయిలో వుందో అంతుపట్టడం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో ప్రకటించిన విధంగా కరోనా లక్షణాలు లేకున్నా వ్యాధి ప్రబలడంతో ఈ రోగం నియంత్రణావిధి దాటి పరుగులు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఆగస్టు ఆఖరి నాటికి రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు దాటే అవకాశం వుం దని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, పరిసర జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తాజా గణాంకాలు చెపుతున్నా యి. ముఖ్యంగా జిహెచ్ఎంసితోపాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. ఆదివారంనాడు వరంగల్ అర్బన్, కామారెడ్డిలలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,296 కొవిడ్ 19 కేసులు నమోదవగా, కొత్తగా మరో ఆరుగురు కరోనాకు బలయ్యారు. రాష్ట్రం లో మొత్తం మృతుల సంఖ్య 415కి చేరింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆదివారం 557 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 111, వరంగల్ అర్బన్ జిల్లాలో 117 కేసులు, మేడ్చల్ జిల్లాలో 87 కేసులు రికార్డయ్యాయి. కామారెడ్డిలో 67 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్, కామారెడ్డిలలో ఇదే రికార్డు. వరంగల్ రూరల్లో అనూహ్యంగా 41 కేసులు బయటపడ్డాయి. అలాగే, కరీంనగర్ జిల్లాలో 27 కే సులు, నల్లగొండలో 26 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 28 కేసులు, మెదక్ జిల్లాలో 29, సిద్దిపేట జిల్లాలో 10, వికారాబాద్ జిల్లాలో 1 కేసు న మోదయ్యాయి. ఇవికాకుండా, ఖమ్మంలో 5, మహబూబ్నగర్ జిల్లాలో 6 కేసులు న మోదయ్యాయి. సూర్యాపేటలో 16, జనగామ జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 24 కేసులు, రాజన్న సిరిసిల్లలో 19 కేసులు, జోగులాంబ గ ద్వాల 4 కేసులు నమోదయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 13 కేసులు, మంచిర్యాల లో 1 కేసు నమోదయ్యాయి. పెద్దపల్లిలో 29, యాదాద్రి భువనగిరిలో 15, ఆసిఫాబాద్లో 1, నిర్మల్లో 1, ములుగులో 2, వనపర్తి జిల్లాలో 7, ఆదిలాబాద్లో 15, జగిత్యాలలో 11 కేసులు రికార్డయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 12,224 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 32,438 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారంనాడు ఒకేరోజు 1,831 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపిం ది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 12,519 శాంపిల్స్ను టెస్టు చేయగా, ఇ ప్పటివరకు మొత్తం 2,65,219 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇంకా 15,181 బెడ్లు ఖాళీగా వున్నాయని తెలిపింది. గాంధీ ఆసుపత్రిలో ఇంకా 1890 బెడ్లు ఖాళీగా వున్నాయనితెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 61 కొవిడ్ ఆసుపత్రు లు నడుస్తున్నాయని, వాటిలో 471 వెంటీలేటర్లు అందుబాటులో వున్నాయని వెల్లడించింది.